Don't Miss!
- News AP Volunteers: 62 వేలకు చేరిన వాలంటీర్ల రాజీనామాలు-ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం.. !
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
త్వరలోనే దర్శకత్వం : ఎస్పీ బాలసుబ్రమణ్యం
నేపథ్య గాయకుడిగా భారతీయ సినీ సంగీత చరిత్రలో శిఖరాగ్ర స్థానాన్ని అందుకున్న ఎస్.పి. బాల సుబ్రమణ్యం త్వరలో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ....'పాడుతా తీయగా' నా సంగీత కళాశాల అని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను 'గోపురం' అనే చిత్రంలో నటిస్తున్నానని, ఇందులో తాను పోషిస్తున్న పాత్ర తెలుగువారంతా గర్వపడేలా ఉంటుందిని బాలు చెప్పకొచ్చారు. బాలు రాక సందర్భంగా నిర్వాహకులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆయన్ను చూసేందుకు పలువురు సంగీత అభిమానులు తరలి వచ్చారు.
గోపురం సినిమాతో పాటు జనార్ధన మహర్షి 'దేవస్థానం' చిత్రంలోనూ బాల సుబ్బహ్మణ్యం నటిస్తున్నారు. ఇందులో కళా తపస్వి కె. విశ్వనాథ్ తో పాటు, ఆమని నటిస్తున్నారు. ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: సురేష్ కుమార్, సంగీతం: స్వరవాణి.