Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'దూకుడు' పంక్షన్ కి వారే స్పెషల్ గెస్ట్ లు
మహేష్ బాబు 'దూకుడు' విజయోత్సవాన్ని విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దూకుడు నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారు ఆ వివరాల్ని వెల్లడిస్తూ ''చిత్ర పరిశ్రమలో భారీ విజయంగా మా చిత్రం నిలిచింది. 350 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. వేడుకనీ ఆ స్థాయిలోనే చేస్తాం. ఈ కార్యక్రమానికి కృష్ణ, కె.రాఘవేంద్రరావు,పూరి జగన్నాథ్ ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తారు. సినీ నటులు పలువురు హాజరవుతారు అన్నారు.
అలాగే ఈ చిత్రానికి ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఒక్కడు తర్వాత మహేష్ బాబు పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొనడం ఇదే అని చెప్పుకోవచ్చు. కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిసింది. అలాగే 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ 'మగధీర" అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి 'దూకుడు" ఫైనల్గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుయనుంది.