twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' పంక్షన్ కి వారే స్పెషల్ గెస్ట్ లు

    By Srikanya
    |

    మహేష్‌ బాబు 'దూకుడు' విజయోత్సవాన్ని విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దూకుడు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారు ఆ వివరాల్ని వెల్లడిస్తూ ''చిత్ర పరిశ్రమలో భారీ విజయంగా మా చిత్రం నిలిచింది. 350 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. వేడుకనీ ఆ స్థాయిలోనే చేస్తాం. ఈ కార్యక్రమానికి కృష్ణ, కె.రాఘవేంద్రరావు,పూరి జగన్నాథ్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తారు. సినీ నటులు పలువురు హాజరవుతారు అన్నారు.

    అలాగే ఈ చిత్రానికి ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఒక్కడు తర్వాత మహేష్‌ బాబు పబ్లిక్ ఫంక్షన్‌లో పాల్గొనడం ఇదే అని చెప్పుకోవచ్చు. కృష్ణ, మహేష్‌ బాబు అభిమానులు ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిసింది. అలాగే 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ 'మగధీర" అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి 'దూకుడు" ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుయనుంది.

    English summary
    Mahesh Babu’s tremendously successful action and comedy entertainer Dookudu is racing towards 50 days in more than 300 direct centers. The 50 days function will be held in a grand way at Siddhartha College in Vijayawada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X