దాసరికి శోభన్బాబు స్వర్ణ కంకణం
హైదరాబాద్ :ప్రముఖ నటుడు శోభన్బాబు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది తెలంగాణ సేవా సమితి, శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి సంయుక్తంగా పురస్కారాలను అందజేస్తోంది. ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును శోభన్బాబు స్వర్ణకంకణ పురస్కారంతో సత్కరించనున్నారు. ఈనెల 10న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వీటిని ప్రదానం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ''శోభన్బాబు మంచి నటుడే కాదు.. మంచి మనిషి. ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేలా చెరగని ముద్ర వేసుకొన్నాడు. అలాంటి వ్యక్తి పేరుమీద ఏర్పాటు చేసిన ఓ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది''అని దాసరి తెలిపారు.
ఇదే వేదికపై నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డికి శోభన్బాబు పురస్కారాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమం తెలంగాణ శోభన్బాబు సేవాసమితి, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జరగనుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు పి.వి.శేషేందర్రావు, ఆమని తెలిపారు.


Click it and Unblock the Notifications











