Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దాసరికి శోభన్బాబు స్వర్ణ కంకణం
హైదరాబాద్ :ప్రముఖ నటుడు శోభన్బాబు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది తెలంగాణ సేవా సమితి, శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి సంయుక్తంగా పురస్కారాలను అందజేస్తోంది. ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును శోభన్బాబు స్వర్ణకంకణ పురస్కారంతో సత్కరించనున్నారు. ఈనెల 10న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వీటిని ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ''శోభన్బాబు మంచి నటుడే కాదు.. మంచి మనిషి. ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేలా చెరగని ముద్ర వేసుకొన్నాడు. అలాంటి వ్యక్తి పేరుమీద ఏర్పాటు చేసిన ఓ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది''అని దాసరి తెలిపారు.
ఇదే వేదికపై నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డికి శోభన్బాబు పురస్కారాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమం తెలంగాణ శోభన్బాబు సేవాసమితి, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జరగనుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు పి.వి.శేషేందర్రావు, ఆమని తెలిపారు.