Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
దాసరికి శోభన్బాబు స్వర్ణ కంకణం
హైదరాబాద్ :ప్రముఖ నటుడు శోభన్బాబు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది తెలంగాణ సేవా సమితి, శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి సంయుక్తంగా పురస్కారాలను అందజేస్తోంది. ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును శోభన్బాబు స్వర్ణకంకణ పురస్కారంతో సత్కరించనున్నారు. ఈనెల 10న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వీటిని ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ''శోభన్బాబు మంచి నటుడే కాదు.. మంచి మనిషి. ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేలా చెరగని ముద్ర వేసుకొన్నాడు. అలాంటి వ్యక్తి పేరుమీద ఏర్పాటు చేసిన ఓ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది''అని దాసరి తెలిపారు.
ఇదే వేదికపై నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డికి శోభన్బాబు పురస్కారాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమం తెలంగాణ శోభన్బాబు సేవాసమితి, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జరగనుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు పి.వి.శేషేందర్రావు, ఆమని తెలిపారు.