Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దాసరికి శోభన్బాబు స్వర్ణ కంకణం
హైదరాబాద్ :ప్రముఖ నటుడు శోభన్బాబు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది తెలంగాణ సేవా సమితి, శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి సంయుక్తంగా పురస్కారాలను అందజేస్తోంది. ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును శోభన్బాబు స్వర్ణకంకణ పురస్కారంతో సత్కరించనున్నారు. ఈనెల 10న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వీటిని ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ''శోభన్బాబు మంచి నటుడే కాదు.. మంచి మనిషి. ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేలా చెరగని ముద్ర వేసుకొన్నాడు. అలాంటి వ్యక్తి పేరుమీద ఏర్పాటు చేసిన ఓ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది''అని దాసరి తెలిపారు.
ఇదే వేదికపై నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డికి శోభన్బాబు పురస్కారాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమం తెలంగాణ శోభన్బాబు సేవాసమితి, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జరగనుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు పి.వి.శేషేందర్రావు, ఆమని తెలిపారు.