Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ గోపాల్ వర్మ, సునీల్ చిత్రంలో మరో విశేషం
సునీల్ హీరోగా రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొందనున్న 'కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు' చిత్రంలో ఓ విశేషం చోటు చేసుకోబోతోంది. ఇప్పటివరకూ తెలుగు పరిశ్రమను ఏలిన కమర్షియల్ దర్శకుల పేర్లు అన్నీ ఓ పాటలో వినపడబోతున్నాయి.కలవ కృష్ణ సాయి అనే రచయిత ఈ పాటను రాస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజువల్ గానూ వారందరి ఫోటోలు తెరపై కనపించనున్నాయి. ఫుల్ లెంగ్త్ కామిడీగా రన్ అయ్యే ఈ చిత్రంలో సునీల్ అమలాపురం నుంచి బయిలుదేరి ఫిల్మ్ నగర్ చేరి ఓ ఫిల్మ్ డైరక్టర్ అయ్యే విధానం ఉండబోతోందోంది. ఈ జర్ని అంతా హిలేరియస్ గా ఉంటుందని వర్మ చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత వర్మ తాను తెలుగులో చేయబోయే చిత్రం అని చెప్తున్నారు. రక్త చరిత్ర రిలీజ్ తర్వాత ఈ చిత్రం రిలీజ్ ఉండబోతోంది. ఇక ఫిల్మ్ డైరక్షన్ ఇంత ఈజీగా అనుకుని వచ్చే అప్పల రాజుకి ఫిల్మ్ ఫీల్డులో ఎదురయ్యే సవాళ్ళు,అవమానాలు నేపధ్యంలో ఈ కథనం నడుస్తుంది. తెలుగులో ఉండే కమిడియన్స్ అంతా ఈ చిత్రంలో నటించబోతున్నారు. లైటర్ వీన్ కామిడీలో చిత్ర పరిశ్రమపై సెటైర్స్ విసరబోతున్నారు. గతంలోనూ వర్మ..సినీ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో మై మాధురీ దీక్షిత్ బనచాహతా హూ, రంగీళా చిత్రాలు తీసారు. అలాగే ఆయన శిష్యడు పూరీ జగన్నాధ్ ఆ మధ్య తెలుగు పరిశ్రమ నేపధ్యంలో నేనింతే అనే చిత్రం తీసిన సంగతి తెలిసిందే. అందులోనూ కృష్ణా నగరే మామ..అనే పాటతో సినీ పరిశ్రమలో ఎదుర్కొనే కష్టాలు చెప్పారు.