Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు థియేటర్లో అనాథ పిల్లలు... నమ్రత అలా చేయడంపై ప్రశంసలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లతో రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు కొత్తగా థియేటర్ బిజినెస్లోకి కూడా దిగారు. 'ఎఎంబి సినిమాస్' పేరుతో అత్యధునిక సదుపాయాలతో మల్టీప్లెక్స్ థియేటర్ కట్టారు.
కేవలం సంపాదించడం మాత్రమే కాదు... అందులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వినియోస్తూ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు మహేష్. ఈ చారిటీ కార్యక్రమాలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. శ్రీమంతుడు సినిమా తర్వాత కొన్ని గ్రామాలను సైతం మహేష్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
తాము కొత్తగా ప్రారంభించిన మల్టీప్లెక్సులో అనాథ పిల్లల కోసం స్పెషల్ షో వేశారు నమ్రత. 'స్పైడర్ మాన్ -ఇన్ టూ ద స్పైడర్- వెర్సే' చిత్రం విడుదల నేపథ్యంలో నమ్రత శిరోద్కర్ సోనీ పిక్చర్స్ ఇండియా వారితో మాట్లాడిని స్పెషల్ షో ఏర్పాటు చేశారు.
నమ్రత శిరోద్కర్ సమక్షంలో 150 మందికి పైగా పిల్లలు ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ ఎఎంబి సినిమాస్లో వీక్షించారు. నమ్రత చిన్నారులతో ప్రత్యేకంగా సమయం గడిపి వారితో కబుర్లు చెప్పటం గమనార్హం. వారి కోసం ఈ స్పెషల్ షో వేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.