Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మళ్లీ వార్తల్లోకి సింగర్ శ్రావణ భార్గవి.. చాలా రోజుల తర్వాత అలా
టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్రసీమలో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ బ్యూటిఫుల్ సింగర్ ఇటీవల వివాదాలతో హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. విభిన్నమైన కాన్సెప్ట్స్తో వ్లోగ్స్ చేస్తూ అటు నెటిజన్లను, ఇటు అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అన్నమయ్య కీర్తన అయినటువంటి ఒకపరి కొకపరి పాటను తనదైన స్టైల్లో వీడియో చేసి యూట్యూబ్లో ఒదిలింది. ఇది చూసిన పలువురు అగ్గిమీద గుగ్గిలం అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోను డిలీట్ చేసి వివాదానికి పుల్స్టాప్ పెట్టిన శ్రావణ భార్గవి మళ్లీ వార్తల్లో నిలిచింది.
1989 ఆగస్టు 16న జన్మించిన శ్రావణ భార్గవి సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనీగా తెలుగు సినీ పరిశ్రమకు రంగప్రవేశం చేసింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో సింగర్గా ఎంట్రీ ఇచ్చిన శ్రావణ భార్గవి అనతి కాలంలోనే పాపులర్ సింగర్గా పేరు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన సింహ సినిమాలోని సింహమంటి చిన్నోడే అంటూ పాడి వెండితెరపై తన గాత్రంతో మ్యాజిక్ చేసింది.
అగ్ర హీరోల సినిమాల్లో..
అనంతరం పవన్ కల్యాణ్ తీన్మార్ చిత్రంలోని అలే బలే, బార్బీ బొమ్మకి, మహేశ్ బాబు ఖలేజా మూవీలోని భూం శకనక, అల్లు అర్జున్ బద్రీనాథ్లోని అంబదరి పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. కందిరీగ, దమ్ము, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రెబెల్, కెమెరా మ్యాన్ గంగంతో రాంబాబు, దేనికైనా రెడీ, కృష్ణం వందే జగద్గురుం, రాజన్న, సోలో వంటి తదితర చిత్రాలలో సాంగ్స్ పాడి ఆకట్టుకుంది.
హీరోయిన్స్కు డబ్బింగ్..
దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, మణిశర్మ, ఎమ్ఎమ్ కీరవాణి, ఎస్ తమన్, దేవి శ్రీ ప్రసాద్, మిక్కీ జె మేయర్ వంటి తదితర ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసింది. స్టార్ హీరోలతోపాటు యువ కథానాయకుల సినిమాలకు పాటలు పాడిన శ్రావణ భార్గవి గబ్బర్ సింగ్, ఈగ, రామయ్యా వస్తావయ్యా, లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాల్లో హీరోయిన్స్కు గాత్రం (డబ్బింగ్) అందించింది.
2018లో చివరిగా..
అయితే శ్రావణ భార్గవి తాజాగా మరోసారి తన గాత్రంతో సినీ ప్రేక్షకులను, అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. శ్రావణ భార్గవి చివరిసారిగా యంగ్ హీరో నితిన్, రాశీ ఖన్నా నటించిన శ్రీనివాస కల్యాణం సినిమాలో పాట పాడింది. ఆ సినిమా 2018లో విడుదలైంది. అంటే సుమారు నాలుగేళ్ల తర్వాత మళ్లీ తన వాయిస్తో మ్యాజిక్ చేయనుంది శ్రావణ భార్గవి.
లైగర్ సినిమాతో..
టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని పాటలకు విశేష స్పందన వచ్చింది. అందులోనూ మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్గా వచ్చిన ఆఫత్ పాట అమితంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ తెలుగు వెర్షన్ను బ్యూటిఫుల్ సింగర్ శ్రావణ భార్గవి ఆలపించింది. సో ఫైనల్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ తన వాయిస్ వినిపించనున్న శ్రావణ భార్గవి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.