Don't Miss!
- News Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిరంజీవి నుంచి శ్రీను వైట్లకు బర్తడే గిప్ట్
హైదరాబాద్: 'బ్రూస్లీ ది ఫైటర్' చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు వేడుకలను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్రంలోని 'లే ఛలో...' అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క తనకు పుట్టిన రోజు గిప్ట్ గురించి శ్రీను వైట్ల చెప్పారు. అది మరేదో కాదు చిరంజీవి ని డైరక్ట్ చేసే అవకాసం రావటమే అన్నారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ.... "చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాసం రావటమే నాకు దొరికిన అత్యత్తమ ఈ పుట్టిన రోజు బహుమతి . నేను ఆయన్ను ఎప్పుడెప్పుడు డైరక్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాను ," అని చెప్పుకొచ్చారు.
శ్రీను వైట్ల కంటిన్యూ చేస్తూ... ''సినిమాలో చిరంజీవిగారు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్ర ఏమిటి? ఏ సందర్భంలో తెరపై కనిపిస్తారన్నది తెరపైనే చూడాలి. మేం మొదట్నుంచీ ఆ పాత్రని చిరంజీవిగారితోనే చేయించాలనుకొన్నాం. కథ విన్నాక బాగుందని మెచ్చుకొంటూ నటించేందుకు ముందుకొచ్చారు. సినిమాలో చిరు కనిపించే సన్నివేశాలు ఆయన చేయనున్న 150వ సినిమాకి టీజర్లా ఉంటాయి. ఇదివరకే నేను ఆయనతో ఓ సినిమా చేశాను. ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరినీ ఒకే సినిమాలో చూపిస్తుండడం ఆనందంగా ఉంది'' అన్నారు..
హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్, ప్రముఖ దర్శకుడు కోనా వెంకట్, నటుడు జయప్రకాశ్, నిర్మాత డి.వి.వి దానయ్య, శ్రీను వైట్ల కుటుంబ సభ్యులు కలిసి గురువారం సాయంత్రం ఆయన చేత కేక్కట్ చేయించారు.
'బ్రూస్లీ' గురించి చెప్తూ...
'బ్రూస్లీ'ని మరో కొత్త ఫార్మాట్లో తీసే ప్రయత్నం చేశా. కోన వెంకట్, గోపీమోహన్తో ఇదివరకు చాలా సినిమాలకి పనిచేశా. మేం మళ్లీ కలిసి ఈ సినిమాకి పనిచేయడం ఆనందంగా ఉంది. బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డిలాంటి నటులు ఇందులోనూ ఉన్నారు. అయితే ఇదివరకటిలాగా వాళ్ల పాత్రలు ఉండవు. ఒక విభిన్నమైన శైలిలో నవ్విస్తారు. ఈ సినిమాని మేం ముందుగా అనుకొన్నట్టుగానే వచ్చే నెల 2న పాటల్ని, 16న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్చరణ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'బ్రూస్లీ'. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం ఆడియో ని అక్టోబర్ 2 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆడియో రైట్స్ ని జీ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో జీ మ్యూజిక్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు.
"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్లు వినపడవ్! రియాక్షన్లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.
విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్లో ముందుకు వెల్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.
నిర్మాతలు చెప్పేదాని ప్రకారం..."బ్రూస్ లీ ...ది ఫైటర్ చిత్రం అక్టబర్ 16న విడుదల అవుతుంది. అలాగే ఈ నెలాఖరున ఆడియోని విడుదల చేస్తారు !!". అలాగే ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ నిర్మాతలు కొద్ది రోజుల క్రితంప్రకటన చేసారు.
ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. చరణ్ ఫైట్ మాస్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్ ఫైట్ మాస్టర్గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.
ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్చరణ్లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు.
రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ది విజయవంతమైన కాంబినేషన్ అనీ, ఆ కాంబినేషన్తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.