Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
విద్యార్థులకు ‘శ్రీరామ రాజ్యం’ బంపర్ ఆఫర్
బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం సినిమా విజయ వంతంగా 50 రోజుల వేడుకకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత యలమంచిలి సాయిబాబు 1 నుంచి 10వ తరగతి వరకు గల స్కూలు విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సోమవారం(డిసెంబర్ 26) నుంచి వారంలో ప్రతి నాలుగు రోజులు(సోమ, మంగళ, బుధ, గురు) టిక్కెట్ రేటులో సగం ధరకే సినిమా చేసే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలు వారి స్కూలు యాజమాన్యాల ద్వారా వారి వారి ప్రదేశములలో ఉన్న థియేటర్ల యాజమాన్యాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాముడిని దేవుడిగా ఎందుకు ఆరాధిస్తున్నామో నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈచిత్రం నిర్మించడం జరిగిందని, ధర్మ పాలన, అన్నదమ్ముల అనురాగం, భార్య భర్తల అనుబంధం, పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను ఎలా గౌరవించాలో, మనిషన్నవాడు పాటించవలసిన మానవతా విలువలు, ఆచరించవలసిన నీతి, నియమాలు, నిబద్ధత...ఇలాంటివి ఎన్నో రాముడిలో మనం చూస్తాం. ఆ విలువల్ని, వ్యక్తిత్వాన్ని నేటి యువతరం ఈ సినిమా ద్వారా చూసి తెలుసుకోవాలని, వాటిని అలవరచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలను ఈ సినిమా చూసే దిశగా ప్రోత్సహించాలని కోరారు.