Don't Miss!
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
పుస్తక రూపంలో 'శ్రీరామరాజ్యం'
బాపు,బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. ఈ చిత్రం జనవరి 5 నాటికి మా చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలతో బాపు బొమ్మలతో ఓ పుస్తకం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. గతంలోనూ బాపు చిత్రాలకు ఇలాంటి పుస్తకాలు విడుదల చేసి ప్రమోట్ చేసే ప్రయత్నం చేసారు. ఇక ఈ విషయాన్ని తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాత యలమంచిలి సాయిబాబా మాట్లాడుతూ...రామాయణంలోని గొప్పదనాన్ని ఈతరానికి చెప్పేందుకు చేసిన ప్రయత్నం 'శ్రీరామరాజ్యం'. ఈ చిత్రానికి వస్తున్న స్పందన సంతృప్తి కలిగించింది. మా ఉద్దేశం నెరవేరినందుకు ఆనందంగా ఉంది. జనవరి 5న ఈ చిత్ర విజయోత్సవాన్ని విజయవాడలో నిర్వహించనున్నాం. భక్తి భావంతో నిర్మించిన సినిమా ఇది. ఇంటిల్లిపాదీ చూసేలా బాపు తీర్చిదిద్దారు. జనవరి 5 నాటికి మా చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. చిత్ర కథను సంక్షిప్తంగా వివరించే పుస్తకాన్ని చిన్నారుల కోసం రూపొందించాం. బాపు బొమ్మలతో దీన్ని తీర్చిదిద్దాం. పాఠశాల విద్యార్థులకు వాటిని అందజేస్తున్నామని అన్నారు.