Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కు ‘శ్రీరామ రాజ్యం’
బాలయ్య అభిమానులకు శుభవార్త. బాలకృష్ణ నటించిన 'శ్రీరామ రాజ్యం" సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక చేయబడింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు. నవంబర్ 28న 500 మంది అంతర్జాతీయ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశామని సాయిబాబు వెల్లడించారు. చాలా సుదీర్ఘం కాలం తర్వాత ఒక భారతీయ పౌరాణిక సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించప బడుతుంది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రీరామ రాజ్యం సక్సెస్ కు కారణమైన మొత్తం టీంకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని చెప్పారు.
బాలకృష్ణ లార్డ్ రామా పాత్రలో, నయనత తార సీత పాత్రలో నటంచిన శ్రీరామ రాజ్యం సినిమా నవంబర్ 17న విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకెలుతోంది. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సాయిబాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై యలమంచిలి సాయబాబు నిర్మించారు. ఇళయరాజ అందించిన అద్భుతమైన సంగీతం సంగీత ప్రియులను ఓలలాడిస్తోంది.