బాలయ్య ‘శ్రీరామ రాజ్యం’ దేశ వ్యాప్తంగా..!

By Bojja Kumar

balakrishna
బాలయ్య నటించిన పౌరాణిక సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే గత నెల ఈ సినిమా 50 రోజుల వేడుక కూడా జరుపుకుంది. ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత యలమంచిలి సాయిబాబు. ఏప్రిల్ 14న మలయాళీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంతటితో ఆగకుండా ఈ సినిమాను హిందీ, ఇంగ్లీష్ లలో కూడా అనువదించి దేశం మొత్తం ఈ సినిమాను మార్కెట్ చేయాలని చూస్తున్నారు నిర్మాత. అదే జరిగితే ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన బాపు పేరు, బాలకృష్ణ, నయనతారల పేర్లు దేశం మొత్తం మారుమ్రోగనున్నాయి.

ప్రస్తుతం బాలయ్య అధినాయకుడు చిత్రంలో నటిస్తున్నాడు. బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముసలాయన పాత్రలో, తండ్రి పాత్రలో , కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. బాలయ్యకు జోడీగా లక్ష్మిరాయ్, సలోనిలు నటిస్తున్నా. పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తీ కంబైన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫిబ్రవరి నెలలోనే ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. ఈ సినిమాను మార్చి 23న విడుదల చేయాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X