Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
ఇదిరా స్పీచ్ అంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.. ఎన్టీఆర్పై శ్రీరెడ్డి కామెంట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాగ్దాటి గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ స్పీచ్ గురించి, ఆయన ప్రసంగం గురించి అందరికీ తెలిసిందే. అది సినిమా వేడుకైనా, రాజకీయ ప్రసంగం అయినా, మరేతర వేడుకలో అయినా ఎన్టీఆర్ మైకు పట్టాడంటే చాలు అవతలి వారు ముగ్దులవ్వాల్సిందే. తాజాగా ఎన్టీఆర్ ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మీట్లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలపై శ్రీరెడ్డి కామెంట్ చేసింది.
నందమూరి హీరోలు..
నందమూరి హీరోలపై శ్రీ రెడ్డి ఎప్పుడూ పాజిటివ్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది. బాలయ్య, ఎన్టీఆర్లను అవకాశం దొరికినప్పుడల్లా ఆకాశానికెత్తేస్తుంటుంది. తాజాగా ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన స్పీచ్ను పోస్ట్ చేస్తూ శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
బాధితుడిగా వచ్చాను..
రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడిన ఎన్టీఆర్ తన కుటుంబంలో జరిగిన సంఘటనలను తలుచుకున్నాడు. ఎంతో జాగ్రత్త పరుడు అయినా నా అన్న జానకీరామ్ రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. రాంగ్ రూట్లో ట్రాక్టర్ రావడం, ఢీ కొట్టడంతో ఆయన మరణించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
33 వేల కిలోమీటర్లు..
తాతగారిని మా నాన్నగారు ఎంతో జాగ్రత్తగా ఉమ్మడి రాష్ట్రంలో 33 వేల కిలోమీటర్లు వాహనంలో తిప్పారు. అప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా చైతన్య రథసారథిగా ఉన్నారు. అలాంటి వారు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాహనం తీసే సమయంలో మీ కుటుంబాన్ని గుర్తుకు చేసుకోండి.. జాగ్రత్తగా వాహనాలను నడపండి అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు.
దీనికి వ్యాక్సిన్ లేదు..
ప్రభుత్వాలు ఎంత కఠినంగా చట్టాలు చేసినా, శిక్షలు విధించినా ఇవి మానవు. మనలో మార్పు రావాలి.. భయంకరమైన వైరస్కు కూడా వ్యాక్సిన్ ఉంది. కానీ ఈ ప్రమాదాలకు మాత్రం వ్యాక్సిన్ లేదంటూ ఎన్టీఆర్ చెప్పిన మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అయితే వాటిపై తాజాగా శ్రీ రెడ్డి స్పందించింది.
నిక్క బోడుచుకుంటున్నాయి..
ఇదిరా స్పీచ్ అంటే, ఎన్టీఆర్ గారి మాటలు వింటుంటే రోమాలు నిక్క బోడుచుకుంటున్నాయి, తాత గారి నుండి వచ్చాయి అనుకుంట నాయకత్వ లక్షణాలు.. ఎన్ని రోజులు గడిచినా నాన్న అంటే ఎంత ప్రేమో ఎన్టీఆర్ గారి కళ్ళల్లో కనపడుతుంది ఎన్టీఆర్ గారికి కుటుంబం అన్నా ఆయన అభిమానులు అన్నా అంత ప్రేమ జై ఎన్టీఆర్ అద్భుతమైన స్పీచ్ అంటూ శ్రీరెడ్డి ట్వీట్లు వేసింది.