Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీరెడ్డి మరో సంచలనం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపులు, టాప్ ప్రొడ్యూసర్ అక్కడే...
తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దారుణాలను బయట పెట్టి సంచలనం క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి అప్పట్లో పలువురు ప్రముఖుల పేర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అందులో టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా ఉన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ నటి ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయట పెట్టింది.
తనపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే(తాజా మాజీ) జీవన్ రెడ్డి వేధింపులకు పాల్పడ్డినట్లు శ్రీరెడ్డి ఆరోపించారు. జీవన్ రెడ్డి వెనక చాలా మంది ఉన్నారని, అయితే వారు తనకు తెలియదన్నారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం పెద్ద మోసగాడు అని శ్రీరెడ్డి ఆరోపించారు.
నిర్మాత బెల్లంకొండ కూడా
అతడు తరచూ అందరినీ పార్క్ హయత్ హోటల్ కు ఇన్వైట్ చేస్తుంటాడని, నన్ను మాత్రమే కాదు చాలా మందిని పిలిచేవాడు. ఇందులో నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.
తొలిసారి అక్కడ కలిశాను
బెల్లంకొండ సురేష్ స్నేహితురాలు ఒకరు నాకూ స్నేహితురాలే. ఆమెను కలిసేందుకు నేను పార్క్ హయత్ హోటల్ వెళ్లాను. అక్కడ నేను జీవన్ రెడ్డిని కలిశాను. అప్పటి నుండి వేధింపులు మొదలయ్యాయని శ్రీరెడ్డి తెలిపారు.
రామ్ చరణ్, ప్రభాస్ పేర్లు చెప్పాడు
తనను తాను స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా చెప్పుకున్నాడు. ‘‘నేను చెబితే రామ్ చరణ్, ప్రభాస్ కూడా సినిమాలు చేస్తారు. ఎందుకంటే మేము రూలింగ్ పార్టీకి చెందిన వారం' అని చెప్పుకునేవాడు. వారు బ్లాక్ మానీ సినిమాల్లో పెట్టేవారు అని శ్రీరెడ్డి ఆరోపించారు.
నేను పతివ్రతను కాదు, కానీ ఆరోజు
జీవన్ రెడ్డి నన్ను అడిగినపుడు... కాస్త టైమ్ కావాలని చెప్పాను. నేను ప్రతివ్రతను, ఎవరితో పడుకోలేదు అని చెప్పడం లేదు. ఆ రోజు నేను కంఫర్టబుల్గా లేను. చాలా సార్లు ఫోన్ చేశాడు నేను వెళ్లలేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్లారు. అతడు ఎంతో మంది మహిళలను వాడుకున్నాడు... అని శ్రీరెడ్డి ఆరోపించారు.