Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీరెడ్డి మరో సంచలనం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపులు, టాప్ ప్రొడ్యూసర్ అక్కడే...
తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దారుణాలను బయట పెట్టి సంచలనం క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి అప్పట్లో పలువురు ప్రముఖుల పేర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అందులో టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా ఉన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ నటి ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయట పెట్టింది.
తనపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే(తాజా మాజీ) జీవన్ రెడ్డి వేధింపులకు పాల్పడ్డినట్లు శ్రీరెడ్డి ఆరోపించారు. జీవన్ రెడ్డి వెనక చాలా మంది ఉన్నారని, అయితే వారు తనకు తెలియదన్నారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం పెద్ద మోసగాడు అని శ్రీరెడ్డి ఆరోపించారు.
నిర్మాత బెల్లంకొండ కూడా
అతడు తరచూ అందరినీ పార్క్ హయత్ హోటల్ కు ఇన్వైట్ చేస్తుంటాడని, నన్ను మాత్రమే కాదు చాలా మందిని పిలిచేవాడు. ఇందులో నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.
తొలిసారి అక్కడ కలిశాను
బెల్లంకొండ సురేష్ స్నేహితురాలు ఒకరు నాకూ స్నేహితురాలే. ఆమెను కలిసేందుకు నేను పార్క్ హయత్ హోటల్ వెళ్లాను. అక్కడ నేను జీవన్ రెడ్డిని కలిశాను. అప్పటి నుండి వేధింపులు మొదలయ్యాయని శ్రీరెడ్డి తెలిపారు.
రామ్ చరణ్, ప్రభాస్ పేర్లు చెప్పాడు
తనను తాను స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా చెప్పుకున్నాడు. ‘‘నేను చెబితే రామ్ చరణ్, ప్రభాస్ కూడా సినిమాలు చేస్తారు. ఎందుకంటే మేము రూలింగ్ పార్టీకి చెందిన వారం' అని చెప్పుకునేవాడు. వారు బ్లాక్ మానీ సినిమాల్లో పెట్టేవారు అని శ్రీరెడ్డి ఆరోపించారు.
నేను పతివ్రతను కాదు, కానీ ఆరోజు
జీవన్ రెడ్డి నన్ను అడిగినపుడు... కాస్త టైమ్ కావాలని చెప్పాను. నేను ప్రతివ్రతను, ఎవరితో పడుకోలేదు అని చెప్పడం లేదు. ఆ రోజు నేను కంఫర్టబుల్గా లేను. చాలా సార్లు ఫోన్ చేశాడు నేను వెళ్లలేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్లారు. అతడు ఎంతో మంది మహిళలను వాడుకున్నాడు... అని శ్రీరెడ్డి ఆరోపించారు.