twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరో ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాపై పడి ఏడుస్తున్నారు.. మీరు మారరా గొర్రెల్లారా: నటి షాకింగ్ కామెంట్స్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా ఓ హీరో ఫ్యాన్స్‌పై పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా హీరో..?

    సోషల్ మీడియాలో యమ యాక్టివ్

    కొద్దిరోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ కారణంగా హాట్ టాపిక్ అయింది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు.

    ప్రభాస్‌పై పాజిటివ్‌గా పోస్ట్

    ప్రభాస్‌పై పాజిటివ్‌గా పోస్ట్

    ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలపై పోస్టులు పెట్టిన శ్రీరెడ్డి.. కొద్దిరోజుల క్రితం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌పై ఫోకస్ చేసింది. ‘ప్రభాస్ ప్రవర్తన చాలా కూల్‌గా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో అతడు కూర్చునే విధానం రాయల్‌గా కనిపిస్తుంది. డ్రీమ్ బాయ్.. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను' అంటూ ఆ పోస్టులో పేర్కొంది. శ్రీరెడ్డి ఎంతో మంది హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చేసింది. అయితే, మొదటిసారి ప్రభాస్‌పై మాత్రం పాజిటివ్‌గా మాట్లాడింది. దీంతో ఈ పోస్ట్ చర్చనీయాంశం అయింది.

    సాహో సినిమాపైనా వ్యాఖ్యలు

    సాహో సినిమాపైనా వ్యాఖ్యలు

    కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ప్రభాస్ సినిమా సాహోపైనా వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ తన డ్రీమ్ బాయ్ అని పేర్కొంటూ.. సాహో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. దీంతో అందరూ ప్రభాస్‌పై శ్రీరెడ్డి మనసు పారేసుకుందని కామెంట్లు చేశారు. అప్పటి నుంచి ఆమెకు ప్రభాస్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.

    సాహో ఎలా ఉంది..?

    తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘సాహో ఎలా ఉంది..? ఇది హిట్టేనా..?' అని పోస్ట్ చేసింది.

    ప్రభాస్ సినిమాపై పడి ఏడుస్తున్నారు

    ప్రభాస్ సినిమాపై పడి ఏడుస్తున్నారు

    ఆ వెంటనే శ్రీరెడ్డి మరో పోస్ట్ చేసింది. ‘పీఈకే ఫ్యాన్స్ గొర్రెల్లారా మారరా..? ఏంట్రా మీరు ప్రభాస్ మూవీ మీద పడి ఏడుస్తున్నారు..?' అని అందులో పేర్కొంది. ఈ పోస్టులో ఆమె అన్న హీరో పవన్ కల్యాణే అని అర్థం అవుతోంది. గతంలోనూ ఆమె ఇదే తరహాలో పవన్‌పై, ఆయన అభిమానులపై కామెంట్లు చేసింది. దీంతో శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇద్దరు హీరో అభిమానుల మధ్య గొడవ జరిగేలా ఆమె చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

    English summary
    Telegu actress Sri Reddy Mallidi, better known as Sri Reddy, is no stranger to controversies having Sri Reddy is Back With Her Controversial Posts. Actress Sri Reddy once again trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X