వాళ్లు వర్జినిటీని లెక్క చేయరు.. అందుకే హీరోయిన్లను కోడళ్లుగా తెచ్చుకుంటారు: శ్రీరెడ్డి సంచలన పోస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా వర్జినిటీ గురించి సంచలన పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్
కొద్దిరోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ కారణంగా హాట్ టాపిక్ అయింది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు.

వ్యక్తిగత విషయాలు కూడా..
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎంతో యాక్టివ్గా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సామాజిక, రాజకీయ, సినీ విషయాలపై తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలు కూడా తరచూ షేర్ చేస్తోంది.

కొందరు హీరోలను టార్గెట్ చేసింది
శ్రీరెడ్డి.. కొద్దిరోజులుగా చేస్తున్న పోస్టులు మరీ వివాదాస్పదం అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్లోని ఎంతో మంది హీరోలను టార్గెట్ చేస్తూ ఆమె.. ఎన్నో సార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా శ్రీరెడ్డి వ్యవహార శైలిలో మార్పులు మాత్రం రావడం లేదు.
హీరోయిన్స్ను కూడా వదలదు
ఈ బోల్డ్ హీరోయిన్.. హీరోలనే కాదు.. ఎంతో మంది హీరోయిన్లను కూడా టార్గెట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిని ప్రత్యేకించి ఫోకస్ చేసింది. వీళ్లను ఉద్దేశిస్తూ తరచూ శ్రీరెడ్డి పోస్టులు పెడుతూనే ఉంటోంది. కొన్ని కొన్ని సార్లైతే ఆమె పోస్టులు మరీ శృతి మించుతున్నాయి. దీంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాటి మహిళలను కించ పరుస్తున్నావెందుకు అంటూ చాలా మంది ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

వాళ్లు వర్జినిటీని లెక్క చేయరు
తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. ‘ధనవంతులు వర్జినిటీని లెక్క చేయరు. అందుకే వాళ్లు హీరోయిన్లను కోడళ్లుగా తెచ్చుకుంటారు. మందు తాగే మహిళలను కూడా. ధనవంతులను ఫాలో అవ్వండి.. ధనవంతులు అవ్వండి' అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అనే అంశంపై అందరూ చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











