Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఒక్కొక్కడి తాట ఒలుస్తా, నెక్ట్స్ పెద్దతలకాయలే: ఎయిడ్స్ రూమర్లపై శ్రీరెడ్డి ఫైర్, 41 కేసులు!
Recommended Video
కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలోని ఇతర సమస్యలపై పోరాటం చేసే క్రమంలో నటి శ్రీరెడ్డి రకరకాల విమర్శలు, కామెంట్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కొందరు ఆమెను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎయిడ్స్ వచ్చి చనిపోయినట్లు కూడా ప్రచారం చేశారు. తనను ఎవరైతే టార్గెట్ చేశారో వారందరిపై కేసులు పెట్టుకుంటూ వెళుతోంది శ్రీరెడ్డి. ఇటీవల హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో 30 మందిపై ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరుకు మొత్తం 41 మందిపై కేసులు పెట్టినట్లు ఆమె తెలిపారు.
ఒక్కొక్కరి తాట ఒలుస్తా, నెక్ట్స్ పెద్ద తలకాయలే
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేసిన అనంతరం శ్రీరెడ్డి తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు. ఇక ఒక్కొక్కరి తాట ఒలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేదానికి ఇక చెల్లు చీటి, ఇప్పటికి 41 మందిపై కేసులు పెట్టాను. నెక్ట్స్ పెద్ద తలకాయలే అంటూ శ్రీరెడ్డి హెచ్చరించారు.
ఎయిడ్స్ వచ్చి చనిపోయినట్లు ప్రచారం
సోషల్ మీడియాలో కొందరు తనపై దారుణమైన రూమర్స్ ప్రచారం చేశారని, తాను ఎయిడ్స్ వచ్చి చనిపోయినట్లు మార్పింగ్ వీడియో క్రియేట్ చేశారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారిపై చర్యలు తీసుకోండి
సొసైటీలో తన క్యారెక్టర్ డిఫేమ్ చేసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారు మాట్లాడిన వీడియోలను యూట్యూబ్ నుండి తొలగించాలని శ్రీరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రముఖుల పేర్లు పేర్కొంటూ శ్రీరెడ్డి ఫిర్యాదు
జీవిత రాజశేఖర్, కరాటే కళ్యాణి, డైరెక్టర్ రాధాకృష్ణ, సత్య చౌదరి, రాధా బంగారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తదితరుల పేర్లను పేర్కొంటూ వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి ఫిర్యాదు చేశారు.