Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘బొమ్మ అదిరింది’ వివాదం.. మధ్యలోకి చిరు, పవన్ను లాగింది.. నాగబాబును బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి
గత కొన్ని రోజులు మెగా అభిమానులు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ మధ్యలో ఓ వార్ జరుగుతోంది. దీనికి కారణం నాగబాబు జడ్జ్గా ఉన్న బొమ్మ అదిరింది అనే కార్యక్రమం. అదిరింది షోకు కొన్ని మార్పులు చేర్పులు చేర్చి.. బొమ్మ అదిరిందిగా రీ ఎంట్రీగా ఇచ్చారు. ఇందులో యాంకర్ రవి, భాను శ్రీ, నవదీప్లను తీసేశారు. శ్రీముఖి, జానీ మాస్టర్లను తీసుకొచ్చారు. అయితే వైఎస్ జగన్ను ఇమిటేట్ చేస్తూ చేసిన స్కిట్తో ఈ షో ఎక్కడికో వెళ్లింది. అలా తమ నాయకుడిని ఇమిటేట్ చేస్తారా? అంటూ జగన్ అభిమానులు రెచ్చిపోయారు. తామేమీ తక్కువ తినలేదని మెగా ఫ్యాన్స్ కూడా రివర్స్ అయ్యారు. మధ్యలో నాగబాబు వేసే సెటైర్లు అగ్గిలో ఆజ్యం పోసినట్టు అయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై లేడీ బాంబ్ శ్రీ రెడ్డి స్పందించింది.
కనకపు సింహాసనం..
అసలే మెగా ఫ్యామిలీ అంటే అంత ఎత్తున లేచే శ్రీ రెడ్డి ఈ వ్యవహారాన్ని వాడకుండా ఉంటుందా. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. అవునురా స్నేక్ బాబూ.. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్ట కూడదురా.. నీలాంటి వెధవలకు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ అనే షోలో జడ్జీని చేసి కనకపు సింహాసనం ఇచ్చారు. ఆయన దగ్గర విశ్వాసంగా ఉండలేదు. ఎంతైనా స్నేక్ బాబువి కదా.. కాటేశావు. నిన్ను ఎవరు సింహాసనంపై కూర్చోబెట్టినా వారిని కాటేశావు అని చెప్పుకొచ్చింది.
మీ అన్నేమో అలా..
ఏంటి రాయల్ హెయిర్ ఆయిల్.. ఒక్క ఈక కూడా పీకలేరా?? వినాశకాలే విపరీత బుద్ధి.. నీ లాంటి వాళ్లని చూసే ఇలాంటి సామెతల్నీ వచ్చాయ్ రా. వాటిని పక్కన పెడితే. మీ అన్నయ్యకు పిచ్చి పట్టి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని జగన్ మోహన్ రెడ్డిని కలుస్తూ ఉంటాడు. కానీ ఎస్పీ బాలు లాంటి గొప్పవారు, కెరీర్ ఇచ్చిన వారు చనిపోతే చూడటానికి మాత్రం రారు. అన్నయ్య అని దొంగ ఏడుపు ఏడుస్తాడు అంటూ చిరంజీవిని కూడా ఈ వ్యవహారంలోకి శ్రీరెడ్డి లాగేసింది.
తమ్ముడు ఇలా..
మీ తమ్ముడు ఏమో.. నువ్ కూసిన కూతలకి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని నిన్ను కరివేపాకులా తీసి పక్కన పెడతాడు. నీకు ఎంపీ సీటు ఇచ్చినా గెలవలేక నీకు పిచ్చిపట్టింది.. నా ఛానల్ నా ఇష్టం అంటావు కాసేపు.. ఇక అదిరింది, బెదిరింది, కుదిరింది, తిక్క కుదిరింది ముదిరింది అంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావ్ అంటూ శ్రీరెడ్ రెచ్చిపోయింది.
పరువు పోతుంది..
నీ పిచ్చితో చిన్న చిన్న కమెడియన్లను బలి చేస్తున్నావ్ .. ముందు పిల్ల పెళ్లి ఉంది ఆ ఏర్పాట్లు చూసుకో. అందరి చేతులో పడి దెబ్బలు తిన్నావ్ అనుకో.. అల్లుడు దగ్గర పరువు పోతుంది. అసలే గుంటూరు అల్లుడు. నీకు ఏం చూసుకునిరా అంత బలుపు. శ్రీముఖి నీకు బుద్ది ఉందా? ఇప్పుడు అందరికీ వ్యతిరేకం అయ్యావ్ అంటూ శ్రీరెడ్డి అందర్నీ టార్గెట్ చేసింది.