Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
శ్రీ రెడ్డి ఎటాక్.. బద్మాష్ నా కొడుకుల్లారా.. లైంగికంగా కవ్వించిందా? అంటూ ఫైర్
రోజు రోజుకూ పసికూనలపై జరుగుతున్న హత్యాచారాలు శృతి మించుతున్నాయి. వయసు పైబడి నలుగురికి మంచి చెప్పాల్సిన యువకులు, వృద్దులు అభం శుభం తెలియని పసికందులపై హత్యాచారాలకు పాల్పడుతుండటం దేశానికే తలదింపు చర్యగా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా కూడా మార్పు రాకపోవడం దేశ ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. అయితే గతంలో మహిళలపై లైంగిక దాడులు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు.. మహిళల వస్త్రాధారణే దానికి కారణం అని వాదించారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అలాంటి వారందరికీ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది శ్రీ రెడ్డి. వివరాల్లోకి పోతే..
హన్మకొండలో కట్టలు తెంచుకున్న కామోన్మాదం
గత మూడు రోజుల క్రితం హన్మకొండలో జరిగిన దారుణ ఘటన దేశం మొత్తాన్ని వణికించింది. కట్టలు తెంచుకున్న కామోన్మాదం 9 నెలల పసికందును బలితీసుకుంది. తల్లిదండ్రులతో హాయిగా డాబాపై నిద్రిస్తున్న ఏడాది లోపు చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి లైంగిక దాడి చేసి హత్యచేశాడు. ఈ ఉదంతం యావత్ భారత దేశాన్ని కలచివేసింది.
పెద్దఎత్తున ఆగ్రహ జ్వాలలు
9 నెలల పసికందుపై లైంగిక దాడి జరగడం జీర్ణించుకొని జనం పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు కురిపించారు. ఈ దుశ్చర్యపై యావత్ జాతి మొత్తం రగిలి పోతోంది. పసి పాప శ్రీహితని చూసి రోదించని గుండె లేదు. ఆ కళ్లు లేని కామాంధుడిని వెంటనే నరికి పారేయాలని దేశమంతా ఒకే గొంతు వినిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద విప్లవం సాగుతోంది.
రష్మి ఫైర్.. ఈ చిన్నారి పొట్టి బట్టలేసిందనా?
ఈ కర్కశమైన ఉదంతంపై సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు. అమ్మాయిలపై జరిగే హత్యాచారాలకు వారు ధరించే దుస్తులు, వేషాధారణే కారణం వాదించే వారిపై సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్నారి ఏమైనా పొట్టి బట్టలేసిందనా? ఇంత దారుణానికి ఎలా ఒడికట్టారు? సిగ్గుగా అనిపించడం లేదా? అని యాంకర్ రష్మి ఆవేదన వెళ్లగక్కింది.
శ్రీ రెడ్డి అటాక్.. వృద్ధనారీ పతివ్రతల్లారా అంటూ
ఈ దారుణ ఘటనపై శ్రీ రెడ్డి కూడా అటాక్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ని తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేస్తూ.. ''ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకుని ఊరేగితే... రేప్ చేయక సన్మానాలు చేస్తారా? అని కామెంట్ చేసిన బద్మాష్ నా కొడుకుల్లారా.. మనం సరిగ్గా ఉంటే నిప్పును అంటుకునేందుకు ఎవడు ధైర్యం చేయరంటూ స్పీచ్ ఇచ్చిన వృద్ధనారీ పతివ్రతల్లారా.. ఈ 9 నెలల పాప ఏం ఎక్స్పోజ్ చేసింది? ఏ బట్టలు వేసుకుని లైంగికంగా కవ్వించింది? ఈ చిన్నారి ఏం చేస్తే వాడిలో మానవ మృగం మేల్కొనది? సమాధానాలు వెతకండి.. ఆన్సర్ దొరికినా సరే.. బదులివ్వకుండా మౌనంగా ఉండిపోదామనుకుంటే కట్ట కట్టుకుని చావండి. మీకన్నా క్రూర మృగాలే నయం'' అని ఫైర్ అయింది శ్రీ రెడ్డి.