రంకు అంటగడతారా, ఆధారాలన్నీ అక్కడ ఇచ్చేశా.. నాకేమైనా అయితే భూకంపమే.. శ్రీరెడ్డి సంచలనం!
శ్రీరెడ్డి.. ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఊపేస్తున్న పేరు ఇది. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో శ్రీరెడ్డి సంచలనం సృష్టిస్తోంది. శ్రీరెడ్డి చర్యలు పూటకో ట్విస్ట్ లా కనిపిస్తున్నాయి. ఇటీవల నిరసన పేరుతో ఈ భామ అర్థనగ్న ప్రదర్సన చేసిన సంగతి తెలిసిందే. దీనితో శ్రీరెడ్డిపై జాతీయ మీడియా దృష్టి కూడా పడింది. శ్రీరెడ్డికి ఓ ఛానల్ సపోర్ట్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ఛానల్ కు శ్రీరెడ్డితో ఉన్నా సంబంధాల గురించి సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వస్తుండడంతో తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో వీడియో ప్రకటన చేసింది.
Recommended Video


రంకు అంటగడతారా
ఓ న్యూస్ ఛానల్ తో శ్రీరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో తన పేస్ బుక్ లో శ్రీరెడ్డి స్పందించింది. తనకు రంకు అంటగడితే నిప్పుతో ఇల్లు కడుక్కున్నట్లే అని శ్రీరెడ్డి హెచ్చరించింది.

భాదితురాల్ని కాబట్టే
తాను భాదితురాల్ని కాబట్టే మీడియా తన వెనుక ఉండి సపోర్ట్ చేస్తోందని శ్రీరెడ్డి తెలిపింది. సోదరి మీడియా ఛానల్ కు తాను తన వద్ద ఉన్నా ఆధారాలు ఇచ్చేశా అని తెలిపింది. నా కేమైనా అంతే వారి ఆ సాక్ష్యాలని బట్టబయలు చేస్తారని శ్రీరెడ్డి హెచ్చరించింది.

రాజకీయ కోణం
తన పోరాటానికి రాజకీయ రంగు పులుముతున్నారని శ్రీరెడ్డి హెచ్చరించింది. తాను టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం చేయడం తగదని శ్రీరెడ్డి తెలిపింది.

ఆ ఉప్పు తిన్నా
తాను దాదాపు రెండు సంవత్సరాల పాటు జగన్ కి సంబందించిన ఓ ఛానల్ ఉప్పు తిన్నానని శ్రీరెడ్డి తెలిపింది. తాను ఏ పార్టీకి వ్యతిరేకమూ కాదు ఏ పార్టీకి అనుకూలము కాదు అనే విషయాన్ని గమనించాలని శ్రీరెడ్డి కోరింది.

మానాలు నలిగిపోతున్నాయి
కాస్టింగ్ కౌచ్ వలన వందలాది మంది యువతుల మానాలు నలిగిపోతున్నాయని, అందువలనే తాను ఈ పోరాటానికి దిగినట్లు వివరణ ఇచ్చింది.

ఎన్ని రాజకీయాలు చేసినా
మా అసోసియేషన్ వారు ఎన్ని రాజకీయాలు చేసినా తాను లొంగనని శ్రీరెడ్డి హెచ్చరించింది. కొంతమంది తనకు డబ్బు ఇచ్చి మభ్యపెట్టాలని ప్రయత్నించారు. వారికీ నేను దాసోహం తినకపోవడం వలెనే ఇలాంటి ఆరోపణాలు సృష్టిస్తున్నారని శ్రీరెడ్డి తెలపడం విశేషం.


Click it and Unblock the Notifications











