Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
మూలశంకోడు.. అనుభవిద్దాం అనుకున్నాడు.. శ్రీ రెడ్డి బూతు పురాణం
టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి సమయం దొరికిందంటే ఆగటం లేదు. తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు మొదలు పెట్టేస్తోంది. టెక్స్ట్, వీడియోలతో సంచలనం సృష్ఠ్టిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ ఆట ఆడేసుకుంది శ్రీ రెడ్డి. తనదైన భావాజాలంతో మెగా బ్రదర్ నాగబాబుకు చుక్కలు చూపించే పోస్ట్ పెట్టి పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది.
కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను అన్యాయంగా వాడుకొని వదిలేస్తున్నారని నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్, శ్రీ రెడ్డి టాపిక్ బాగా సెన్సేషన్ అయింది. దీంతో రంగంలోకి దిగిన నాగబాబు.. శ్రీ రెడ్డి ఏకిపారేశారు. అప్పటి నుంచే మెగా ఫ్యామిలీ శ్రీ రెడ్డి ఇష్యు పలు చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో నాగబాబును ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి చేసిన తాజా పోస్ట్ పెను సంచలనాలు సృష్టిస్తోంది.
'మూలశంకోడు.. ఎంపీ అవుదామనుకున్నాడు కదా, స్నేక్ బాబు ఎక్కడ? జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గర వెయింగ్ అంట కదా'' అని పేర్కొంటూ వివాదాస్పద పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. అసలే జనసేన గల్లంతైందని బాధలో ఉన్న మెగా అభిమానులకు ఈ పోస్ట్ చిర్రెత్తే కోపం తెప్పిస్తోంది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా శ్రీ రెడ్డిని బూతు పదజాలం యమ ఆడుకుంటున్నారు.
2019 ఎన్నికలు జనసేన పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఒక్కటి మినహాయిస్తే పవన్ పార్టీ అన్నిస్థానాల్లో ఓటమి పాలై అన్నయ్య దారిలోనే నేను అని చెప్పకనే చెప్పేసింది. ఇక భీమవరం, గాజువాక ప్రజానీకం పవన్కి పంచ్ ఇవ్వగా, నర్సాపురం ప్రజలు మెగా బ్రదర్ నాగబాబు వంక కూడా చూడకపోవడం విశేషం. వెరసి ఈ అన్నాదమ్ములిద్దరూ మూట ముల్లె సర్దుకునే పరిస్థితి నెలకొంది.