Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అనసూయ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది: శ్రీరెడ్డి కామెంట్
Recommended Video
కాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి పోరాటం మొదలు పెట్టిన తొలి నాళ్ల నుంచే ఆమె ఒకరిని తరచూ టార్గెట్ చేస్తూ వస్తోంది. ఆవిడ మరెవరో కాదు... టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అలాంటివి ఏమీ లేదని, తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది లేదని రకుల్ స్టేట్మెంట్ ఇవ్వడంపై అప్పట్లో శ్రీరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పడల్లా రకుల్ను టార్గెట్ చేస్తూనే ఉంది శ్రీరెడ్డి. తాజాగా ఆమె నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తన ప్రతాపం చూపించే ప్రయత్నం చేసింది. ఆమెను టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టింది.
రకుల్ ఐరన్ లెగ్
రకుల్ ఐరన్ లెగ్.. ఆమె మా బాబాయ్ సినిమాలో హీరోయిన్ అన్నపుడే ఇది డిజాస్టర్ అని డిసైడ్ అయ్యాను... నేను ఊహించిందే జరిగింది అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘మన్మధుడు 2' మూవీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
అనసూయ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కాకుండా అనసూయ అయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు, తప్పకుండా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది అని శ్రీరెడ్డి అభిప్రాయ పడ్డారు. శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. రకుల్ మూవీ విడుదలైన రోజే అనసూయన నటించిన ‘కథనం' విడుదలైన సంగతి తెలిసిందే.
శ్రీరెడ్డి కామెంట్లపై నెటిజన్ల స్పందన ఇలా...
రకుల్ మీద శ్రీరెడ్డి చేసిన కామెంట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె కామెంట్లకు కొందరు సపోర్ట్ చేస్తుండగా... ‘మీకు రకుల్ ఇష్టం లేకపోతే ఆమెను ఐరెన్ లెగ్ అంటారా ఆమె నటించిన మూవీస్ హిట్ అయినవి కూడా ఉన్నాయి' అని మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మన్మధుడు 2
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మన్మధుడు 2' చిత్రం ఆగస్టు 9న విడుదలైంది. ఈ మూవీ తొలి 4 రోజుల్లో రూ. 8.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ. 12 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేయాల్సి ఉంది.