Don't Miss!
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- News కొంచెం ఓపిక పడితే .. అమరావతి రైతులకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఊరట..!
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాకు కనీసం ఒక్కసారి కూడా కాలేదు.. అలాంటి వారినే చేసుకుంటా.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్
శ్రీ రెడ్డి ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో ఎవ్వరికి తెలీదు. ఏ హీరో మీద, ఏ రాజకీయ పార్టీ మీద పడుతుందో ఎవ్వరూ చెప్పలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటుంది. సినీ ప్రముఖుల్లో నాని, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలపై ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటుంది.
ఆ మధ్య అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉన్న శ్రీ రెడ్డి.. రాకేష్ మాస్టర్ కామెంట్స్తో మళ్లీ తన పాత అవతారంలోకి మారింది. ఫేస్బుక్ లైవ్లో అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి, మెగా ఫ్యామిలీ ఇలా అన్నింటిపైనా మాట్లాడుతూ దుమ్ముదులిపింది. ఇక అక్కడి నుంచి మొదలైన శ్రీ రెడ్డి.. ప్రతీ విషయంపై స్పందిస్తూ వస్తోంది. ఈ మధ్య రానాను కాస్త టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
ఏం జరిగిందో నాకు తెలుసు..
రానా తన ప్రేయసి మిహికా బజాజ్ను సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేశాడు. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. ‘నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు.. ఈ అమ్మాయితో ప్రశాంతమైన జీవితం కొనసాగించాల'ని పోస్ట్ చేసింది. శ్రీ రెడ్డి ఈ విధంగా ప్రశాంతంగా ఓ పోస్ట్ చేయడం, కాసింత పాజిటివ్గా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రానా బావా అంటూ మరో పోస్ట్..
రామానాయుడు స్టూడియోలో రానా బావా ఎంగేజ్మెంట్.. తరువాత నాదే అంటూ మరో పోస్ట్ చేసింది. అయితే అది రోకా ఈవెంట్ అని తరువాత అందరికీ తెలిసింది. అయితే శ్రీ రెడ్డి చేసిన ఈ పోస్ట్ రానాను బావా అంటూ సంబోధించడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రాజకీయ పోస్ట్లు సైతం..
కేవలం సినిమా తారల విషయాలు, సినిమా ఇండస్ట్రీపైనే కాదు.. రాజకీయంగానూ అందర్నీ విమర్శిస్తూ ఉంటుంది. సమాజంలోని సమస్యలపైన గళమెత్తుతుంది. కరోనా సమయంలో వలస కూలీలు పడుతున్న కష్టాలను లేవనెత్తుతూ.. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
Recommended Video
వారినే పెళ్లి చేసుకుంటా..
తాజాగా శ్రీ రెడ్డి చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘నాకు కనీసం ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు.. కానీ శీలాన్ని కోల్పోయాను.. ఎవరైనా ఫేక్ న్యూస్ వార్తలు రాస్తే అతన్నే పెళ్లి చేసుకుంటాను' అని పోస్ట్ చేసింది.