Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన శ్రీ రెడ్డి.. అనుమానంగా ఉందంటూ కేసు!
వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఓ వ్యక్తిపై అనుమానంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా చెన్నైలో ఉంటున్న ఆమె అక్కడి పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ ఏం జరిగింది? శ్రీ రెడ్డి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వివరాల్లోకి పోతే..
మకాం మార్చిన శ్రీ రెడ్డి.. అన్నీ అక్కడి నుంచే
కాస్టింగ్ కౌచ్ ఉదంతంపై ఓ రేంజ్లో విరుచుకుపడిన శ్రీ రెడ్డి టాలీవుడ్ చిత్రసీమలో పెద్ద దుమారమే రేపింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది నటీనటులకు టార్గెట్ చేస్తూ సంచలనం సృష్టించింది. ఆ తరువాత కొంతకాలానికి హైదరాబాద్ వదిలిన ఈ అమ్మడు చెన్నైకి చెక్కేసి అక్కడే మకాం పెట్టేసింది. అక్కడి నుంచే తన సోషల్ మీడియా వేదికగా తన ఉద్యమాన్ని సాగిస్తోంది.
తమన్నా వెబ్ సిరీస్.. బంగ్లాలో ఒక్కటే గోల
ప్రస్తుతం శ్రీ రెడ్డి చెన్నై నగరంలోని వలసరవాక్కం, అన్భునగర్లోని ఒక ప్లాట్లో ఉంటోంది. అయితే ఆమె ఇంటి సమీపంలోని ఓ బంగ్లాలో నటి తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందని, ఆ యూనిట్ గోల పడలేకపోతున్నానని ఇటీవలే శ్రీ రెడ్డి పేర్కొన్న సంగతి తెల్సిందే. ఈ మేరకు ఇటీవలే దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఆమె.. వారితో మాట్లాడి ఈ సమస్యకు పుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది.
శ్రీ రెడ్డి కంప్లైంట్.. కేసు నమోదు
ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితం శ్రీ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. షూటింగ్ జరుగుతున్నందున ఇబ్బందిగా ఉందని, అదేవిధంగా తన ఆడి కారును ఆ షూటింగ్ నిర్వహిస్తున్న ఓ ధ్వసం చేశాడని కంప్లైంట్ చేస్తూ కేసు నమోదు చేసింది శ్రీ రెడ్డి.
పోలీస్ అధికారి బంగ్లా.. రాత్రి తిరిగి వచ్చేసరికి
స్థానిక కోయంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన శ్రీ రెడ్డి.. తాను ఉంటున్న ఇంటి సమీపంలో విశ్రాంత పోలీస్ అధికారి బంగ్లా ఉందని, అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతున్న కారణంగా ఆ ప్రాంతంలో పలు కార్లను నిలుపుతున్నారని తెలిపింది. అయితే తాను సోమవారం బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చేసరికి తన ఇంటి ముందు ఒక వాహనం నిలిపి ఉండటంతో దాన్ని పక్కన పెట్టించి తన కారును పార్క్ చేసుకున్నానని పేర్కొంది.
అతనిపైనే అనుమానం.. శ్రీ రెడ్డి కారు ధ్వంసం
అయితే ఆ తర్వాత కొంతసేపటికే తన ఖరీదైన ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం ఎవరో ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది శ్రీ రెడ్డి. ఆ షూటింగ్ చేస్తున్న చిత్ర కార్యనిర్వాహకుడు మనోజ్పై తనకు అనుమానం ఉందని ఆమె తెలిపింది. దీంతో కేసును నమోదు చేసుకున్న కోయంబేడు ఇన్స్పెక్టర్ మాదేశ్వరన్ విచారణ చేపట్టారని సమచారం.