Don't Miss!
- News పట్టు కోల్పోయిన పవన్: వైసీపీలో మరో జనసేన సీనియర్
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అనారోగ్యంగా ఉన్న మురళీ మోహన్ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. వంకర మాటలు మాట్లాడితే నీ గతి అంటూ
Recommended Video
అస్సలు తగ్గేదే లేడనట్లుగా శ్రీ రెడ్డి పెడుతున్న వరుస పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను మరోసారి కదిలిస్తున్నాయి. గతంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో నానా హంగామా చేసి చివరకు దుస్తులు కూడా విప్పేసిన శ్రీ రెడ్డిని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ మకాం మార్చి అక్కడ కాస్త పాపులారిటీ తెచ్చుకుంది శ్రీ రెడ్డి. కానీ టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు శ్రీ రెడ్డి. తాజాగా ఈమె అనారోగ్యంగా ఉన్న మురళీ మోహన్ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది.
ఎవ్వరినీ వదిలేదే లేదు అన్నట్లుగా
కాస్టింగ్ కౌచ్ పై తానూ చేసిన ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓ ఒక్కరినీ వదిలేది లేదు అన్నట్లుగా శ్రీ రెడ్డి రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది. గత కొన్ని రోజులుగా నాని, తేజ లపై పంచులేస్తూ విరుచుకు పడిన ఈమె.. తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్పై తనదైన కోణంలో వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
అనారోగ్యంతో బెడ్పై మురళీ మోహన్
ప్రస్తుతం మురళీ మోహన్ అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకుంటున్నారు. తన తల్లి అస్థికలు గంగలో కలిపేందుకు అలహాబాద్, వారణాసి వెళ్లి అక్కడ అస్వస్థతకు గురయ్యారు మురళీ మోహన్. దీంతో ఆయన వెన్నుముకకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయాల్సివచ్చింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇల్లీ అక్కతో తాజ్ బంజారాలో డైరెక్టర్ తేజ రాసలీలలు.. సెన్సేషన్గా మారిన శ్రీ రెడ్డి పోస్ట్
మురళీ మోహన్ రెచ్చిపోయి కామెంట్స్
అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మురళీ మోహన్ పై ఒక్కసారిగా విరుచుకుపడి షాకిచ్చింది శ్రీ రెడ్డి. సీనియర్ నటుడైన ఆయనపై నోరు పారేసుకుంటూ.. వంకర మాటలు మాట్లాడితే.. దేవుడు ఇలాగే అన్ని వంచేస్తాడంటూ ఆమె పట్టిన శాపనార్థాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారాయి.
నన్ను తిట్టిన ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు
ఈ మేరకు శ్రీ రెడ్డి తన పోస్ట్ లో ''రియల్ ఎస్టేట్ భూమి కాదు కాపాడేది, మంచితనం ఒక్కటే జీవితంలో అన్ని కష్టాలనుంచి కాపాడతది..ఈ మధ్య వెన్నుముక వంగిపోయి ,కాళ్లు వంకర్లు పోయినోయ్ అంటగా మురళి మోహన్ గారు! ఇక నుంచైనా కష్టాల్లో వున్నవాళ్ళని చూసి వంకర వంకర మాటలు మాట్లాడకండి.. దేవుడు అన్ని వంచేస్తాడు..నన్ను తిట్టిన ప్రతి ఒక్కరు ఏదొక రూపంలో అనుభవిస్తున్నారు పాపం.. దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు కర్మ తిరిగి అప్ప చెప్పటానికి !ఏది ఏమైనా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా'' అని పేర్కొంది శ్రీ రెడ్డి.
వరుస పెట్టి ఇలా చేస్తోందంటే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాప్ కావడం మొదలు శ్రీ రెడ్డి తన కామెంట్లకు మళ్లీ పదును పెట్టింది. పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసి యాక్టర్ నాని, డైరెక్టర్ తేజ లపై సంచలనం కామెంట్స్ చేసి ఇప్పుడు ఏకంగా సీనియర్ నటుడు మురళీ మోహన్ ని టార్గెట్ చేస్తోందంటే శ్రీ రెడ్డి తన పోరాటంతో మరోసారి విజృభించనుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.