Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
పవన్ ఫ్యాన్స్ బుర్ర తక్కువ వాళ్లే.. వకీల్ సాబ్ ఈ కేసు వాదించండి.. శ్రీరెడ్డి ఘాటుగా ట్వీట్
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్పై సెటైర్లు వేశారు. తాజాగా జరిగిన ఓ సంఘటన గురించిన వీడియోను షేర్ చేసి ఘాటుగా కామెంట్ పెట్టారు. ఏ మాత్రం బుర్ర ఉపయోగించుకోకుండా డబ్బులు సమర్పించుకొంటారా అంటూ ఓ సైబర్ క్రైమ్ విషయంలో కామెంట్ చేసింది. ఆ సైబర్ క్రైమ్ ఏమిటి? శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు ఏమిటంటే?
Recommended Video
వెంకీ కుడుములకు ఫోన్ చేసి
హైదరాబాద్ పోలీసుల తెలిపిన ప్రకారం.. ఓ సైబర్ నేరస్థుడు దర్శకుడు వెంకీ కుడుములకు ఫోన్ చేసి.. మీ భీష్మ చిత్రం అవార్డుల కేటగిరికి ఎంపికైంది. ఆరు కేటగిరిలో ఎంపికైనందున్న వాటికి 10,600 రూపాయల చొప్పున ఫీజు చెల్లించి అవార్డులకు ఎంపిక చేసుకోవాలని దర్శకుడు వెంకీకి డైరెక్టోరేట్ ఆఫ్ ఫిల్మ్ కార్పోరేషన్ నుంచి నవీన్ కుమార్ అనే వ్యక్తి సూచించారు.
సైబర్ నేరగాడి చేతిలో మోసపోయిన వెంకీ
అయితే తన సినిమా భీష్మకు మంచి గుర్తింపు లభించడంతో సంతోషంలో మునిగి ఆరు కేటగిరిలకు రూ.63 వేలకు పైగా చెల్లించాడు. ఆ తర్వాత మళ్లీ నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి.. టెక్నికల్ సమస్య కారణంగా ఆ డబ్బు డిపాజిట్ కాలేదు. ఆ మొత్తాన్ని త్వరలో రీఫండ్ చేస్తాం. మళ్లీ మీరు ఓసారి ఆరు కేటగిరిలకు ఫీజు చెల్లించండి అంటూ భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రిక్వెస్ట్ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో
నవీన్ కుమార్ మాటలతో అనుమానం చెందిన వెంకీ కుడుముల.. తన నిర్మాతను అడిగి ఫీజు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో జరిగిన సంభాషణతో చీటింగ్ గురయ్యానని తెలుసుకొన్న వెంకీ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సైబర్ నేరస్థుడి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్పై
దర్శకుడు వెంకీ కుడుముల మోసానికి గురికావడంతో శ్రీరెడ్డి నాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్ కావడంతో వెంకీపై కామెంట్లు గుప్పించారు. ట్విట్టర్లో స్పందిస్తూ ఆయన మోస పోయిన తీరుపై తనదైన శైలిలో ట్వీట్లు చేశారు.
భలే మోసపోయాడే అంటూ
వెంకీ కుడుములపై శ్రీ రెడ్డి సెటైర్ వేస్తూ.. అయ్యో, పాపం నితిన్ భలే మోసపోయాడే. ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లే మరీ. కొంచెం వాడండి రా బుర్ర. వకీల్ సాబ్ గారు ప్లీజ్ ఈ కేసు కూడా వాదించండి అంటూ ట్వీట్ చేశారు. అయితే వెంకీ కుడుముల మోసపోతే.. నితిన్ పేరు ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.