Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు.. కనీసం ఒక్కరోజైనా అలా చెయ్.. శ్రీ రెడ్డిపై ఫ్యాన్స్ ఫైర్
శ్రీ రెడ్డికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మధ్య ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ను ధూషించడం, పవన్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేయడం అందరికీ తెలిసిందే. ఆమె కూడా పవన్ ఫ్యాన్స్ను ఓ రేంజ్లో ఆడుకుంది. తాజాగా మళ్లీ పవన్ కళ్యాణ్పై కామెంట్స్ చేసింది. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video
సమయం సందర్భం లేకుండా..
శ్రీ రెడ్డి పోస్ట్లు పెట్టడానికి, ఒకరిని కామెంట్ చేయడానికి ఓ సమయం సందర్భం ఉండదు. ఇష్టం వచ్చినప్పుడు ఎవరి మీద పడితే వారి మీద విరుచుకుపడుతూ ఉంటుంది. సినీ, రాజకీయ, భక్తి వంటి అంశాలపై నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
పవన్ కళ్యాణ్ను టార్గెట్..
పవన్ కళ్యాణ్పై కామెంట్స్ చేయడానికి శ్రీ రెడ్డి ఏ మాత్రం వెనకాడదు. ప్రతీ రోజూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ మళ్లీ రచ్చ రచ్చ అయ్యేలా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు..
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వస్తోంది. అయితే ఈ లాక్ డౌన్లో కొంత మంది సెలెబ్రిటీలు బయటకు వచ్చి ఆహారం దొరక్క అవస్థ పడుతున్నవారికి అన్నదానాలు చేస్తున్నారు. వీటిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి ఓ పోస్ట్ చేసింది.‘పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు ఎవ్వరికైనా దొరికితే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పజెప్పండి ప్లీజ్' అంటూ ఓ పోస్ట్ చేసింది.
కనీసం ఒక్క రోజైనా..
పవన్ కళ్యాణ్ ప్రతీసారి డొక్కా సీతమ్మ ప్రస్థావన తెస్తూ ట్వీట్స్ చేస్తుంటాడు. వాటిపై సెటైర్స్ వేస్తూ.. ‘డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటే కనీసం ఒక్క రోజైనా రోడ్డు మీద వెళ్లే బాటసారులకు అన్నం చేసింది. ఇక ఈ పోస్ట్లపై పవన్ ఫ్యాన్స్ విరుచుకపడ్డారు. ఓ రేంజ్లో కామెంట్స్ పెడుతూ శ్రీ రెడ్డిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.