Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Sri Reddy: లైగర్ మూవీపై శ్రీరెడ్డి రివ్యూ.. అంత హైప్ అవసరమా అంటూ..
టాలీవుడ్ డేరింగ్ అండ్ మాస్ డైరెక్టర్ అంటె టక్కున గుర్తు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఆయన సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఆయన డైలాగ్స్, స్క్రీన్ ప్లేకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురిచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యాటిట్యూడ్తో అర్జున్ రెడ్డిగా అతి తక్కువ కాలంలోనే ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం లైగర్. అత్యంత భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 25న విడుదలైన లైగర్పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపింది. అది ఎలా ఉందంటే?
లైగర్ మూవీని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.
సూపర్బ్ రెస్పాన్స్..
సినిమా విడుదలకు ముందు ఎంతో క్రేజ్ సంపాదించుకుంది లైగర్. అందుకు కారణం ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్నింటికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అంతకుమించి వివిధ రాష్ట్రాల్లో చిత్రబృందానికి వచ్చిన స్పందన మరిచిపోలేం.
అభిమానుల సందడితో..
అంతేకాకుండా ప్రమోషన్స్లో భాగంగా వరంగల్లో ఫ్యాన్డమ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం, సందడి మధ్య సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రమోషన్స్లలో ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుంది అని విజయ్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది.
ఒక్కోలా స్పందన..
ఇక గురువారం విడుదలైన లైగర్ సినిమా మిక్స్డ్ టాక్తో నడుస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండే జోడీగా నటించిన ఈ చిత్రంపై ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి శ్రీరెడ్డి లైగర్పై తన స్పందన తెలియజేసింది.
ఆ సినిమా అద్భుతం..
'లైగర్కు ముందు లైగర్కు తర్వాత అంట.. అనవసరమైన హైప్లు అవసరమా?, కంటెంట్ ఉన్నోడికి హైప్ అవసరం లేదు. లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్. బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం' అని ట్వీటర్ ద్వారా శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది.
హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి..
ఇక టాలీవుడ్లో శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి, పలువురు ప్రముఖుల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ టాపిక్తో రచ్చ చేసిన శ్రీరెడ్డి తర్వాత అనేక అంశాలపై మాట్లాడింది.
యూట్యూబ్లో వ్లోగ్స్..
అనేక నటీనటులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తుంటుంది. ఇక ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్లో పలు వ్లోగ్స్ చేస్తుంది. అప్పుడప్పుడు సినీ పరిశ్రమ, రాజకీయ అంశాలపై తనదైన శైలీలో రియాక్ట్ అవుతూ ఉంటోంది శ్రీరెడ్డి.