పవిత్ర లోకేష్, నరేష్ పై శ్రీరెడ్డి ఫైర్.. అపవిత్ర బంధాలే అంటూ తొడ కొడుతూ సవాల్!

టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారం మీద వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం మీద తాజాగా ఫేస్బుక్ లైవ్ నిర్వహించిన శ్రీ రెడ్డి ఒకపక్క పవిత్ర లోకేష్ పైన మరో పక్క నరేష్ పైన పలు ఆరోపణలు గుప్పించింది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి ఏమన్నది? ఆమె ఏమేం ఆరోపణలు చేసింది అనే వివరాల్లోకి వెళితే

ఏమి హక్కు ఉంది?

ఏమి హక్కు ఉంది?

నటి పవిత్ర లోకేష్ పైన శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసలు నరేష్ భార్య విషయంలో కలగ చేసుకోవడానికి నువ్వు ఎవరు? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు? మీ గురించి ఆమె మాట్లాడేందుకు హక్కు ఉంది కానీ ఆమె గురించి మాట్లాడేందుకు మీకు ఏమి హక్కు ఉంది? ఎందుకు వేరే వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోస్తున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

యాసిడ్ తో కడగాలంటూ

యాసిడ్ తో కడగాలంటూ

పవిత్ర అని పేరు పెట్టుకున్న నువ్వు ఎంత మందితో అయినా రిలేషన్స్ పెట్టుకోవచ్చు కానీ మేము మీతో ఉద్యమం గురించి మాట్లాడితే డబ్బులు తీసుకున్నప్పుడు గుర్తు లేదా అంటూ హేళనగా మాట్లాడిందంటూ ఆమె పాత విషయాలను గుర్తు చేశారు. ఇక నరేష్ కూడా నేను మీటూ ఉద్యమం చేస్తున్నప్పుడు నన్ను మా అసోసియేషన్ నుంచి బ్యాన్ చేశాడని నేను అర్ధనగ్నంగా ప్రొటెస్ట్ చేసిన చోట యాసిడ్ తో కడగాలంటూ కామెంట్ చేశాడని ఆమె గుర్తు చేస్తూ ఆరోపణలు గుప్పించారు.

టైం వస్తుంది కదా

టైం వస్తుంది కదా

తన మీటు ఉద్యమం గురించి హేళనగా మాట్లాడిన వారి జీవితాలు ఏమవుతున్నాయో అందరికీ తెలిసిందే అంటూ పవిత్ర లోకేష్, నరేష్, కరాటే కళ్యాణి, పవన్ కళ్యాణ్, జీవిత రాజశేఖర్ ల గురించి ఆమె ప్రస్తావించారు. పవిత్రకు ఎంతో మందితో రిలేషన్స్ ఉన్నాయని ఆమె చాలామంది జీవితాల్లో నిప్పులు పోసిందని శ్రీరెడ్డి ఆరోపించింది. తాను ఇబ్బందులలో ఉన్నప్పుడు వీరంతా మరింత ఇబ్బంది పెట్టారని కానీ ఆ రోజు తాను ఏమీ మాట్లాడకుండా వదిలేశానని నాకు కూడా టైం వస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాను ఆ టైం ఇప్పుడు వచ్చింది అంటూ శ్రీరెడ్డి పేర్కొన్నారు.

వీడియోలు విడుదల

వీడియోలు విడుదల

ఇక ఈ మధ్య బయటకు వచ్చిన ఒక స్టింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేష్ తాను నరేష్ తో సహజీవనం చేస్తున్నాననే విషయాన్ని ఒప్పుకున్నారు. అది స్టింగ్ ఆపరేషన్ అని తెలిసిన తరువాత ఇదంతా రమ్య రఘుపతి చేయిస్తుందని డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేయిస్తుందని అంటూ ఒకపక్క నరేష్ మరోపక్క రమ్య రఘుపతి ఇద్దరు కూడా వీడియోలు విడుదల చేశారు. తాజాగా రమ్య రఘుపతి, నరేష్- పవిత్ర లోకేష్ కలిసి ఉన్న ఒక హోటల్ దగ్గరకు వెళ్లి హోటల్ గది తలుపులు కొడుతూ రాద్ధాంతం సృష్టించారు.

పవిత్ర లోకేష్ గురించి

పవిత్ర లోకేష్ గురించి

నరేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గొడవ పెద్దది కాకుండా నరేష్, పవిత్ర లోకేష్ లను అక్కడి నుంచి పంపించేశారు అలా పంపుతున్న క్రమంలో రమ్య రఘుపతి చెప్పు తీసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రమ్య రఘుపతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మా బంగారమే మంచిది కానప్పుడు పవిత్ర లోకేష్ గురించి తానేమీ మాట్లాడలేనని ఆమె చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X