Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కూతురు సినిమా రంగంలోకి రావడంపై శ్రీదేవి స్పందన
హైదరాబాద్: నటి శ్రీదేవి కూతురు జాహ్నవి త్వరలో సినిమాల్లోకి వస్తోందని, హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘పులి' సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్న శ్రీదేవికి తన కూతురుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తన పెద్ద కూతురు సినిమాల్లో వస్తుందన్న వార్తలను ఆమె ఖండించారు. జాహ్నవి ప్రస్తుతం డిగ్రి పూర్తి చేసి పై చదువులపై దృష్టి పెట్టిందని, ఇప్పటి వరకు ఎలాంటి సినిమా కూడా అంగీకరించలేదని స్పష్టం చేసింది. జాహ్నవి చదువుపైనే దృష్టి పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. యాక్టింగ్ అనేది ఈజీ జాబ్ కాదన్నారు. దానికి ఎంతో హార్డ్ వర్క్ అవసరం. భవిష్యత్తులో ఆమె సినిమాల్లోకి వస్తుందా? రాదా? అనేది నేను ఇప్పడు చెప్పలేదు, ఆమె సినిమాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వస్తుందన్నారు.
విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పులి' చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' రేంజిలో ఉంటుందని అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ‘పులి' సినిమా డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు.
పిల్లలను, పెద్దలను, అభిమానులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.
శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్పై సి జె శోభ విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీదేవి కూడా నటిస్తున్నారు. సినిమాలో ఆమె కీలకమైన పాత్రలో మహారాణిగా కనిపించబోతున్నారు. విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ సుదీప్, ప్రభు, తంబి రామయ్య, సత్యన్, జూనియర్ బాలయ్య, నరేన్, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.