ఆ సినిమాని చూడ్డానికి శ్రీదేవి, బోనీకపూర్ హైదరాబాద్ రాక
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎర్ర గులాబీలు' చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ ధియోటర్ లో శ్రీదేవి,బోనీ కపూర్ దంపతులు తిలకించారు. సమీరారెడ్డి,సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం విడదలైంది. గులాబి చిత్రం హీరోయిన్ మహేశ్వరి సోదరుడు కార్తీక్ ఈ చిత్రంలో నటించారు.మహేశ్వరి..శ్రీదేవికి సోదరి కావటంతో ఈ షోకు శ్రీదేవి దంపతులు వచ్చారు.అందులోనూ శ్రీదేవి గతంలో భారతీరాజా దర్శకత్వంలో కమల్ సరసన 'ఎర్ర గులాబీలు' చిత్రంలో చేసింది. దాంతో ఆ సినిమాని కూడా శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
శ్రీదేవి మహేశ్వరి సమీరా రెడ్డి సమంత ఎర్ర గులాబీలు భారతీరాజా sridevi maheswari sameera reddy samantha erra gulabeelu bharathi raja kamal


Click it and Unblock the Notifications