Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీడియాపై నిప్పులు చెరిగిన శ్రీదేవి బోనీకపూర్...!
శ్రీదేవి చేసే ఖర్చులు భరించలేక బోనీ కపూర్ ఒక మీడియా సంస్థకు హెడ్ గా ఉద్యోగంలో చేరాడని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పడు ఆ వార్తలపై శ్రీదేవి, బోనీ కపూర్ లు తీవ్రంగా ఖండిస్తూ అవి రాసిన న్యూస్ పేపర్ పైన పరువు నష్టం దావా వేశారు. తానేమీ పాపర్ కానని ఆర్థికంగా దెబ్బతిన్న మాట నిజమే అయినా ఖర్చులు భరించలేక ఉద్యోగంలో చేరాల్సిన ఖర్మ ఇంకా పట్టలేదని బోనీ విరుచుకుపడ్డాడు.
సదరు న్యూస్ పేపర్ పై 50కోట్లకు పరువు నష్టం దావా వేసాడా..ఆర్థిక ఇబ్బందులు అందరికీ వస్తాయని అందుకు ఉదాహరణంగా అమితాబ్ పేరును కూడా చెప్పేస్తున్నాడు బోనీ కపూర్. శ్రీదేవి షోకులకు, హాలిడేయింగ్లకు, రెష్టారెంట్ లకు, పార్టీలకు చేసే ఖర్చు నెలకు 25లక్షల దాకా అవుతాయంటూ మీడియాలో వచ్చిన వార్తలకు శ్రీదేవి షాకవుతూ, పత్రికల్లో పర్సనల్ విషయాలు రాసేముందు ఒకసారి తనని అడిగి తెలుసుకోవలసింది అంటూ తన వంతు కోపం ప్రదర్శించింది శ్రీదేవి.