Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవి మూలాలు తిరుపతిలో..కుటుంబాన్ని కలుసుకునేందుకు వస్తానని మాట ఇచ్చి!
శ్రీదేవి తిరుపతిలో జన్మించకపోయినా ఈ ఆధ్యాత్మిక నగరంతో శ్రీదేవి కుటుంబానికి సంబంధం ఉంది. శ్రీదేవి పూర్వీకులు నివసించింది తిరుపతిలోనే. ఆ తరువాత శ్రీదేవి కుటుంబం తమిళనాడుకు వలస వెళ్లారు. శ్రీదేవి బంధువులు ఇప్పటికి తిరుపతిలో నివాసం ఉంటున్నారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తిరుపతి వచ్చిన ప్రతి సందర్భంలో శ్రీదేవి తన కుటుంబసభ్యలని కలుసుకుని వెతుంది.
Recommended Video
తిరుపతిలో విషాద ఛాయలు
శ్రీదేవి మృతితో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి పూర్వీకులు నివసించింది తిరుపతిలోనే. తిరుపతిలో ఉంటున్న శ్రీదేవి బంధువులు ఆమె మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
తిరుపతి నుంచి వలస
శ్రీదేవి పూర్వీకులు తిరుపతిలోనే నివాసం ఉండేవారు. కాల క్రమంలో వారు తమిళనాడుకు వలస వెళ్లారు. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో 1963 లోజన్మించారు. చెన్నైలో బాలనటిగా చేశారు.
శ్రీదేవి తల్లి మరణం తరువాత
శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం తరువాత ఆమె పినతల్లులు అనసూయమ్మ, మునిసుబ్బమ్మ శ్రీదేవి ఆలనా పాలనా చూసే వారు. వారు ప్రస్తుతం తిరుపతిలోనే నివసిస్తున్నారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే వారు విషాదంలో మునిగిపోయారు.
తిరుపతి వస్తానని మాట ఇచ్చి
శ్రీదేవి తిరుపతి వచ్చిన ప్రతిసందర్భంలో తన కుటుంబ సభ్యలని కలుసుకుని వెళ్లేవారు. ఈ ఏడాది తిరుపతికి వచ్చినప్పుడు ఇంటికి తప్పకుండా వస్తానని శ్రీదేవి మాట ఇచ్చిందట. కానీ అంతలోనే ఈ అతిలోక సుందరి తుదిశ్వాస విడిచి అందరిని విషాదంలో ముంచివేసింది.
సినిమా మీదే ద్యాస
శ్రీదేవికి సినిమా మీదే ప్రేమ తప్ప మరో ద్యాస లేదని ఆమె బంధువులు గుర్తుచేసుకున్నారు.