Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
క్రికెట్లోకి అడుగు పెడుతున్న శ్రీదేవి!
ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రీదేవి...మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి త్వరలో లైమ్ లైట్లోకి రావాలని చూస్తున్న సంగతి తెలిసిందే. 'ఇంగ్లిష్ వింగ్లిష్" సినిమా ద్వారా ఆమె మళ్లీ తెరపై తళుక్కునడానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఫోటో షూట్లు, ర్యాంపు వాకుల్లో జిగేల్ మంటున్న శ్రీదేవి, ఎప్పడెప్పుడా అనే విధంగా అభిమానులను ఊరిస్తోంది.
శ్రీదేవి సినిమా పునరాగమనం విషయం పక్కన పెడితే..... మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న సెల్రబిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో శ్రీదేవి, ఆమె భర్త బోణి కపూర్ పెట్టుబడులు పెట్టాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా బెంగాల్ ప్రాంచైజీని కొనడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తమ ప్రాంచైజీ కోసం మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. బహుషా గంగూలీ ప్లేయర్ గా లేదా, కన్సల్టెంట్ గా పని చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై శ్రీదేవి దంపతుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.