Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభుదేవాతో డాన్స్, సవాల్ అంటున్న శ్రీదేవి
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి తన భర్త బోనీ కపూర్, కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి చైనాలోని మాకావు వెళ్లింది. చాలా కాలం తర్వాత శ్రీదేవి మళ్లీ స్టెప్పులు వేస్తుండటంతో అభిమానులు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలో శ్రీదేవి ప్రముఖ టెలివిజ్ షో ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాగా ప్రజాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో తెలుగు వెర్షన్ శ్రీదేవి ద్వారా ప్రారంభం కాబోతోందని అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్గా ఖరారు కావాల్సి ఉంది.
ఇప్పటికే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో ఓ ఫ్రాంచైజీ సొంతం చేసుకుని సినిమా రంగంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న శ్రీదేవి...ఇక బుల్లితెరపై తన సత్తా చాటాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే తెలుగులో 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.