Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవి ఉంటే కన్నీళ్లు పెట్టుకునేది... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదంపై భగ్గుమన్న ఆర్ నారాయణ మూర్తి
Recommended Video
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు తాజాగా రాసిన అతిలోక సుందరి శ్రీదేవి కథ పుస్తకావిష్కరణ బుధవారం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటి రకుల్ ప్రీత్ సింగ్ పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు, విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ రానాయణ మూర్తి శ్రీదేవికి సంబంధించిన విషయాలతో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెన్సార్ వివాదం గుర్తు చేసుకున్నారు. గతంలో తన సినిమా సెన్సార్ ఇబ్బంది వచ్చినపుడు బొంబాయి వెళ్లినపుడు శ్రీదేవి కలిశారని రివైండ్ చేసుకున్నారు.
తెలుగోడు వస్తే చాలా హెల్ప్ చేసేది
గతంలో నా సినిమా సెన్సార్ ఇబ్బంది వల్ల బొంబాయి వెళ్లాను. శ్రీదేవి ఎంత గొప్ప వ్యక్తి అంటే... ఇక్కడి నుంచి ఏ తెలుగోడు వచ్చినా వాళ్ల పీఏతో మాట్లాడి బ్రహ్మాండంగా హెల్ప్ చేసేది. మంచి మనసున్న వ్యక్తి. నన్ను చూడగానే ఏమిటి ఇలా వచ్చారని అడిగితే సెన్సార్ ఇబ్బంది వల్ల వచ్చానని చెప్పాను. మీరు విప్లవ సినిమాలు బాగా చేస్తారు, నాకూ విప్లవ సినిమా చేయాలని ఉందని చెప్పారని... ఆర్ నారాయణ మూర్తి గుర్తు చేసుకున్నారు.
శ్రీదేవి ఉంటే కన్నీళ్లు పెట్టుకునే వారు
శ్రీదేవి గారు ఉంటే ఈ రోజు సెన్సార్ బోర్డు విషయంలో జరిగే విషయాలు చూసి కన్నీళ్లు పెట్టుకునే వారు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మగారు ఒక సినిమా(లక్ష్మీస్ ఎన్టీఆర్) చేస్తే సెన్సార్ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. ఎంత దుర్మార్గం... అంటూ ఫైర్ అయ్యారు.
ఇదేం ప్రజాస్వామ్యం
ఎవడో ఎలిగేషన్ పెడితే ఆపేస్తారా? పాలిటిక్స్ మీద సినిమా చేస్తే సెన్సార్ చేయరా? వివరణ ఇచ్చుకోవడానికి అవరావతి వెళ్లాలా? ఇదేం ప్రజాస్వామ్యం.... అంటూ మండి పడ్డారు.
ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి
సినిమాల సెన్సార్ విషయంలో ఏవైతే అభ్యంతరాలు పెడుతున్నారో దాన్ని ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి. ఎవరూ కల్పించుకోకూడదు. ఏదైనా ఉంంటే సెన్సార్ బోర్డ్ చూసుకుంటుంది. నిర్మాతలను ఇబ్బంది పెడితే ఎలా? ఎన్టీ రామారావుగారి మీద మండలాధ్యక్షుడు తీస్తే... నా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు, తిట్టినా చూస్తారు అని మహానుభావుడు గొప్పాగా చెప్పారు. అదీ ఆయన సంస్కారం... అని నారాయణ మూర్తి గుర్తు చేసకున్నారు.