Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అంతేనా...? కూతురుపై శ్రీదేవి షాకింగ్ న్యూస్!
ఓ ప్రముఖ పత్రికతో శ్రీదేవి మాట్లాడుతూ...జాహ్నవి సినిమాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. హీరోయిన్ షేపు రావడానికి బరువు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. కానీ జాహ్నవికి ఇంకా 15 సంవత్సరాలే. జాహ్నవి దృష్టంతా చదువుమీదే పెట్టేలా చూస్తున్నా. సినిమాల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆమెకు మంచి ఎడ్యుకేషన్ అందించాలనేదే నా కోరిక అని చెప్పింది. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల నా చదువు పూర్తి చేయలేక పోయాను అని వెల్లడించింది.
జాహ్నవిని సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన కంటే...ఆమె త్వరగా పెళ్లి చేసుకుని, జీవితంలో సెటిల్ అవ్వాలనేదే నా కోరిక, కానీ జాహ్నవి సినిమాల్లోకి వస్తానని ఆశ పడితే మాత్రం ఎంకరేజ్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చింది శ్రీదేవి.
ఇలా శ్రీదేవి తన కూతురు గురించి చెప్పిన విషయాలు విని షాకవుతున్నారు అభిమానులు. శ్రీదేవి వారసురాలిగా జాహ్నవి సినిమాల్లోకి వస్తే ఆమెలో శ్రీదేవిని చూసుకుందామని అనుకున్నాం. కానీ మా ఆశ తీరేలా లేదు అంటూ శ్రీదేవి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.