అతిలోకసుందరి శ్రీదేవి రీ ఎంట్రీ కన్ఫర్మ్...డిటేల్స్
శ్రీదేవి అభిమానులకు శుభవార్త. ఆమె చిరకాల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ..ఓ చిత్రం చేస్తోంది. అమితాబ్ ప్రధాన పాత్రలో చేయనున్న ఈ చిత్రాన్ని బల్కి డైరక్ట్ చేస్తున్నారు. బల్కి గతంలో అమితాబ్ తో పా, చీనీకమ్ చిత్రాలు రూపొందించి క్రిటికల్ ఎక్లైమ్ తో పాటు కమర్షియల్ విజయం సాధించారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇక శ్రీదేవి, అమితాబ్ కాంబినేషన్ లో గతంలో ఇక్విలాబ్, ఆఖరి రాస్తా, ఖుదాగవా చిత్రాలు వచ్చి హిట్ అయ్యాయి. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతున్న ఈ పెయిర్ మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











