Don't Miss!
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వీడియో: అర్ధరాత్రి శ్రీదేవి కూతురు.. ప్రియుడితో రెచ్చిపోయి డ్యాన్స్
తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి జాహ్నవి కపూర్ ఓ పార్టీలో చేసిన డ్యాన్స్ మళ్లీ హాట్ టాపిక్గా మారింది.
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఇంకా వెండితెరపైకి రాకముందే ఆమె వ్యవహారాలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల తన ప్రియుడు శిఖర్ పహారియాతో ఓ పార్టీలో చేసిన డ్యాన్స్ మళ్లీ హాట్ టాపిక్గా మారింది. జాహ్నవి, పహారియా ఉన్న వీడియోను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ వీడియోకు విపరీతంగా లైక్ వస్తున్నాయి.
పార్టీలో జాహ్నవి రెచ్చిపోయి డ్యాన్స్
19 ఏండ్ల జాహ్నవి డ్యాన్స్ ఫ్లోర్పై రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియుడు శిఖర్ పహారియాతో పార్టీకి హాజరైన జాహ్నవి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రస్ను ధరించి బ్యూటిఫుల్గా కనిపించింది. తుమ్కాలు ఇస్తూ డ్యాన్స్ చేస్తుండగా ప్రియుడు లయబద్ధంగా జోష్ పెంచడం విపరీతంగా ఆకట్టుకొంటున్నది.
పహారియా అఫైర్ రూమర్లకు తెర
పహారియాతో జాహ్నవికి అఫైర్ ఉందంటూ వచ్చిన రూమర్లకు తాజా వీడియో తెరదించేలా కనిపించింది. గత కొద్దికాలంగా బహిరంగంగానే వీరద్దరూ కనిపించడం ముంబైకి మీడియాకు పండగగా మారింది. జాహ్నవి, పహారియా ప్రేమకు శ్రీదేవి దంపతుల మద్దతు కూడా ఉందనే వాదన వినిపిస్తున్నది.
కరణ్ జోహర్ చిత్రంలో జాహ్నవి కపూర్
జాహ్నవి కపూర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ రూపొందించే ఓ చిత్రంలో జాహ్నవి నటించనున్నట్టు ఆమె తండ్రి బోనీకపూర్ వెల్లడించారు. అయితే అధికారికంగా ప్రకటన చేయలేదు.
మరాఠీ చిత్రం సైరత్లో జాహ్నవి, ఇషాన్
మరాఠీలో సంచలన విజయం సాధించిన సైరత్ రీమేక్లో జాహ్నవి కపూర్, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ జంటగా నటించనున్నారనే వార్త బాలీవుడ్లో ఇటీవల గుప్పుమన్నది. అయితే ఆ వార్తలను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ఖండించారు. 'జాహ్నవి, ఇషాన్ తెరపైన సరైన జంటగా అనిపించరు. వారిని వేర్వేరు చిత్రాల్లో నటింపజేస్తాను' అని కరణ్ అన్నారు.