Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీదేవిని చంపేశారు, ముంచి చంపడం చాలా ఈజీ.. పక్క గదిలోనే.. రిటైర్డ్ పోలీస్ సంచలనం!
Recommended Video
భారత చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అతిపెద్ద షాక్ తగిలింది. అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్య మరణం అందరిని షాక్ కు గురిచేసింది. వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ కు వెళ్లిన శ్రీదేవి అక్కడ బస చేసిన హోటల్ లో అనుమానాస్పద పరిస్థితుల మధ్య తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం తరువాత దుబాయ్ దుబాయ్ ప్రభుత్వం పెద్ద హై డ్రామానే నడిపింది.
దీనితో అతిలోక సుందరి మృతి గురించి అనేక ఉహాగానాలు, అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే శ్రీదేవి ప్రమాదవ శాత్తు బాత్ టబ్ లో పడి మృతి చెందినట్లు దుబాయ్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. దీనితో అనుమానాలు ఇంకా పెరిగినప్పటికీ ఆ విషయాన్ని అంతటితో సద్దుమణిగించారు. తాజాగా రిటైర్డ్ పోలీస్ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వేద భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనుమానాలు ఉన్నపటికీ
శ్రీదేవి మృతిపై ఇప్పటికీ అనుమానాలు తొలగలేదు. దుబాయ్ లో శ్రీదేవి మరణించిన పరిస్థితులు, ఆమె మరణానికి కారణంగా చెబుతున్న పొంతనలేని సమాధానాలే ఈ అనుమానాలకు కారణం. శ్రీదేవి ప్రమాదవ శాత్తు బాత్ టబ్ లో పడి మరణించడానికి అనారోగ్యంతోనే, వృద్ధాప్యంతోనో ఉన్న మహిళ కాదు.
దుబాయ్లో హై డ్రామా
శ్రీదేవి మరణించిన తరువాత దుబాయ్ లో మూడు రోజుల పటు హై డ్రామా కొనసాగింది. దుబాయ్ ప్రభుత్వమే శ్రీదేవి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. శ్రీదేవి ప్రమాదవ శాత్తు మరణించలేదని, హత్య చేసారని కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రమాదమే అంటూ రిపోర్ట్
మూడురోజుల హడావిడి అనంతరం శ్రీదేవి ప్రమాదవ శాత్తు బాత్ టబ్ లో పడి మృతి చెందినట్లు రిపోర్ట్ ఇచ్చింది. దీనితో శ్రీదేవి మరణం విషయంలో ఉన్న అనుమానాలు బలవంతంగా అణచివేయబడ్డాయి.
రిటైర్డ్ అధికారి సంచలనం
జాతీయ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం రిటైర్డ్ పోలీస్ అధికారి వేద భూషణ్ శ్రీదేవి మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి మర్డర్ చేసారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ముంచి చంపేయడం సులువే
ఓ వ్యక్తిని బాత్ టబ్ లో ముంచి చంపేయడం, ఆ తరువాత ఆధారాలు లేకుండా చేయడం చాలా సులభం అని ఆయన అన్నారు. తాను శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె పక్క గదిలోనే ఉన్నానని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని శ్రీదేవి మరణించిన ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించగా అనుమతించలేదని అన్నారు.
ప్లాన్ చేసి చంపేశారు
శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించినట్లు దుబాయ్ పోలీసులు ఇచ్చిన నివేదిక అర్థవంతంగా లేదని అన్నారు. వారు చెబుతున్న కారణాలు ఒక్కటి కూడా నమ్మదగినవిగా లేవని వేద భూషణ్ అన్నారు. శ్రీదేవిని ప్లాన్ ప్రకారం చంపేశారని అతడు ఆరోపిస్తున్నాడు.