Don't Miss!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అతిలోక సుందరికి అదంటే చాలా ఇష్టం, అందుకే అంత్యక్రియల్లో కూడా!
Recommended Video
ప్రముఖ నటి శ్రీదేవి శనివారం అర్దరాత్రి మరణించినప్పటికీ దుబాయ్ నిబంధనల ప్రకారం ఫార్మాలిటీస్ పూర్తికావడానికి ఆలస్యం అవుతోంది. దీంతో ఆమె భౌతిక కాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. శ్రీదేవి అంత్యక్రియల్లో తెలుపు రంగు తప్ప మరే రంగు కూడా కనిపించకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీదేవికి అదంటే చాలా ఇష్టం
శ్రీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆమె ధరించే దుస్తువుల విషయంలో అయినా, మరే విషయంలో అయినా దానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారట. దీంతో వైట్ థీమ్తో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ప్రతిదీ అదే రంగుంలో...
అంత్యక్రియల్లో వాడే ఫ్లవర్స్, ఇతర వస్తువులు తెలుపు రంగులోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి కూడా తెలుపు రంగు దుస్తుల్లోనే హాజరుకావాలని సూచనలు చేసినట్లు సమాచారం.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని
శ్రీదేవి అంత్య క్రియల్లో ఆమెకు ఇష్టమైన వస్తువులు, రంగులకు ప్రధాన్యం ఇస్తూ నిర్వహిస్తారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరే విధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖులంతా ముంబైకి
శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దక్షిణాది పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులతో పాటు షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న బాలీవుడ్ స్టార్స్ సైతం ముంబై చేరుకుంటున్నారు. ఆమె భౌతిక కాయానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మంగళవారం అంత్యక్రియలు?
సోమవారం రాత్రికి గానీ శ్రీదేవి భౌతిక కాయం ఇండియా వచ్చే అవకాశం లేక పోవడంతో మంగళవారం ఉదయం శ్రీదేవి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.