twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి గెస్ట్ రోల్ చేస్తుందంటూ బోనీ వివరణ

    By Srikanya
    |

    ముంబై : " శ్రీదేవి లేకుండా నేను మిస్టర్ ఇండియా సీక్వెల్ ని ఊహించలేను. ఎందుకంటే నేను మిస్టర్ ఇండియా సమయంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాను. తర్వాత నా ప్రేమను ఆమె ఒప్పుకోవటానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఎమోషనల్ గా నాకు ఆ సినిమాతో బాగా అనుభందం ఉంది. కాబట్టి మిస్టర్ ఇండియా సీక్వెల్ లో శ్రీదేవి గెస్ట్ రోల్ చేస్తుంది. ఆమె లేకుండా నేను సినిమా చేయను," అని తేల్చి చెప్పారు బోనీ కపూర్.

    అలాగే సల్మాన్ తన చిత్రంలో ముంగాబో పాత్రలో చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అసలు ఎలా సల్మాన్ ని ఆ పాత్రలో ఊహిస్తారు అని ఎదురు ప్రశ్న వేసారు. అలాగే ముగాంబో పాత్ర ఉండాలని రూల్ కూడా లేదు. ఎందుకంటే నేను మిస్టర్ ఇండియాను రీమేక్ చేయటం లేదు..కేవలం సీక్వెల్ తీస్తున్నాను అంతే అని తేల్చి చెప్పారు.

    దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన 'మిస్టర్‌ ఇండియా' హిందీ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. అనిల్‌కపూర్‌, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం భారీ స్థాయిలో పెద్ద హిట్టయింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ నిర్మించడానికి నిర్మాత బోనీకపూర్‌ (శ్రీదేవి భర్త) సన్నాహాలు చేస్తున్నాడు. మొదట్లో మరో దర్శకుడిని తీసుకుందామని ఆయన ఆలోచించినప్పటికీ, తర్వాత మనసు మార్చుకుని ఒరిజినల్‌ తీసిన శేఖర్‌కపూర్‌నే దీనికి దర్శకుడిగా నియమించుకున్నాడు. కాగా, ఒక యవ జంట ప్రధాన పాత్రలు పోషించే ఈ 'మిస్టర్‌ ఇండియా-2'లో అనిల్‌, శ్రీదేవి జంట కూడా కీ రోల్స్ లో కనిపిస్తారు. పాత్రల్లో కనిపిస్తారు.

    మరో ప్రక్క 'మిస్టర్‌ ఇండియా' చిత్రాన్ని ఇప్పుడు త్రీడీలోకి మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే త్రీడీలోకి మార్చే వ్యవహారాలపై చర్చలు సాగిస్తున్నట్లు బోనీ స్పష్టం చేశారు. బహుశా వచ్చే ఏడాది మే నుంచి త్రీడీ పనులు మొదలుపెట్టి 2014లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఆ తరవాతే రెండో భాగాన్ని రూపొందిస్తామని బోనీ తెలిపారు.

    ఇక ఈ త్రీడి చిత్రం అన్ని వర్గాల వాళ్ళని అలరించనున్నట్లు నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ త్రీడి కోసం నిపుణలు పని ప్రారంభించినట్లు చెప్తున్నారు. శ్రీదేవి సైతం తను త్రిడిలో కనపించటంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. సీక్వెల్ కన్నా ఇదే సరైన వ్యవహారమని ఆమె భావిస్తోంది. ఈ త్రీడి చిత్రాన్ని తమిళ,తెలుగు భాషల్లో సైతం డబ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    “It was during the shooting of Mr. India that I fell in love with my wife Sridevi. I wooed her for 15 years before she agreed to marry me,” Boney says. It goes without saying that Sridevi will be a part of the sequel too. “Yes, Sri will play a small cameo in the film. For emotional reasons I cannot make the film without her,” Boney adds. While he confirms Sridevi’s role in the film, Boney denies rumours about casting Salman as Mogambo. “How can Salman play Mogambo?” he retorts. “Honestly, if I had my way, I’d cast Salman in every film but that isn’t possible. I would like to clarify that there is no Mogambo in the sequel. I am not remaking Mr India. It’s a sequel and I would like to keep it that way.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X