Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రీదేవి గెస్ట్ రోల్ చేస్తుందంటూ బోనీ వివరణ
ముంబై : " శ్రీదేవి లేకుండా నేను మిస్టర్ ఇండియా సీక్వెల్ ని ఊహించలేను. ఎందుకంటే నేను మిస్టర్ ఇండియా సమయంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాను. తర్వాత నా ప్రేమను ఆమె ఒప్పుకోవటానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఎమోషనల్ గా నాకు ఆ సినిమాతో బాగా అనుభందం ఉంది. కాబట్టి మిస్టర్ ఇండియా సీక్వెల్ లో శ్రీదేవి గెస్ట్ రోల్ చేస్తుంది. ఆమె లేకుండా నేను సినిమా చేయను," అని తేల్చి చెప్పారు బోనీ కపూర్.
అలాగే సల్మాన్ తన చిత్రంలో ముంగాబో పాత్రలో చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అసలు ఎలా సల్మాన్ ని ఆ పాత్రలో ఊహిస్తారు అని ఎదురు ప్రశ్న వేసారు. అలాగే ముగాంబో పాత్ర ఉండాలని రూల్ కూడా లేదు. ఎందుకంటే నేను మిస్టర్ ఇండియాను రీమేక్ చేయటం లేదు..కేవలం సీక్వెల్ తీస్తున్నాను అంతే అని తేల్చి చెప్పారు.
దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన 'మిస్టర్ ఇండియా' హిందీ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. అనిల్కపూర్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం భారీ స్థాయిలో పెద్ద హిట్టయింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మించడానికి నిర్మాత బోనీకపూర్ (శ్రీదేవి భర్త) సన్నాహాలు చేస్తున్నాడు. మొదట్లో మరో దర్శకుడిని తీసుకుందామని ఆయన ఆలోచించినప్పటికీ, తర్వాత మనసు మార్చుకుని ఒరిజినల్ తీసిన శేఖర్కపూర్నే దీనికి దర్శకుడిగా నియమించుకున్నాడు. కాగా, ఒక యవ జంట ప్రధాన పాత్రలు పోషించే ఈ 'మిస్టర్ ఇండియా-2'లో అనిల్, శ్రీదేవి జంట కూడా కీ రోల్స్ లో కనిపిస్తారు. పాత్రల్లో కనిపిస్తారు.
మరో ప్రక్క 'మిస్టర్ ఇండియా' చిత్రాన్ని ఇప్పుడు త్రీడీలోకి మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే త్రీడీలోకి మార్చే వ్యవహారాలపై చర్చలు సాగిస్తున్నట్లు బోనీ స్పష్టం చేశారు. బహుశా వచ్చే ఏడాది మే నుంచి త్రీడీ పనులు మొదలుపెట్టి 2014లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఆ తరవాతే రెండో భాగాన్ని రూపొందిస్తామని బోనీ తెలిపారు.
ఇక ఈ త్రీడి చిత్రం అన్ని వర్గాల వాళ్ళని అలరించనున్నట్లు నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ త్రీడి కోసం నిపుణలు పని ప్రారంభించినట్లు చెప్తున్నారు. శ్రీదేవి సైతం తను త్రిడిలో కనపించటంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. సీక్వెల్ కన్నా ఇదే సరైన వ్యవహారమని ఆమె భావిస్తోంది. ఈ త్రీడి చిత్రాన్ని తమిళ,తెలుగు భాషల్లో సైతం డబ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.