తప్పుడు ప్రచారమే, శ్రీహరికి ఆ వ్యాధి లేదు: ప్రభుదేవా
అయితే ఇదంతా తప్పుడు ప్రచారమే అంటున్నారు దర్శకుడు ప్రభుదేవా. తాను దర్శకత్వం వహిస్తున్న 'రాంబో రాజ్ కుమార్' సినిమా షూటింగులో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారని, శ్రీహరి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని తెలిపారు.
శ్రీహరికి కేన్సర్ వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ముంబైలో షూటింగ్ పూర్తయ్యాక ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండె పోటు రావడం వల్లనే ఆయన చనిపోయారు అని ప్రభుదేవా వెల్లడించారు. ఆయన ఎప్పుడూ ఎంతో ఆరోగ్యం, ఫిట్నెస్గా ఉంటారు అని ప్రభుదేవా వెల్లడించారు.
శ్రీహరి భార్య కూడా ఇదే విషయం వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ అనే హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లినట్లు తెలిపారు. సినిమా షూటింగులో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె తెలిపారు. హోటల్ రూమ్లో పాలు తాగి పడుకున్నారని. కొంత సమయంత తర్వాత చాతి నొప్పిఉందని చెప్పి కుప్ప కూలిపోయారని, ఆయన్ను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు శాంతి తెలిపారు. వైద్యులు బృందం ఆయన్ను పరీక్షించి బీపీ డౌన్ అయిందని తెలిపారని, 4 గంటలకు మరణించినట్లు ధృవీకరించారని తెలిపారు.


Click it and Unblock the Notifications












