Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నట్టికుమార్, శ్రీహరి 'భైరవ' కు జూ ఎన్టీఆర్...
"తప్పు చేసిన వాడిని చంపడం తప్పయితే ఆ తప్పును లక్షసార్లయినా చేస్తాడు ఈ భైరవ" అని శ్రీహరి చెప్పడాన్ని తొలి సన్నివేశంగా చిత్రీకరించారు. జూ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా విచ్చేసి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎంతో బిజీగా ఉన్నా శ్రీహరి పై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఎన్టీఆర్ రావటం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. శ్రీహరి హీరోగా నట్టికుమార్ నిర్మాతగా విశాఖ టాకీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'భైరవ'. పోలూరి శ్రీనివాసరెడ్డి (గులాబి) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలు హైదరాబాద్ లో మొదలయ్యాయి. ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్నిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ "నట్టి కుమార్ నా 'దాసన్నా' చిత్రాన్ని 150 ప్రింట్లతో విడుదల చేసి, సక్సెస్ సాధించి, తానేమిటో నిరూపించుకున్నారు. భిన్నమైన యాక్షన్ కథాంశంతో 'భైరవ' రూపొందుతోంది. మేఘాంశ్ ఈ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమవుతుండటం సంతోషంగా ఉంది" అని చెప్పారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ "నేను మరిచిపోలేని కథానాయకుడు శ్రీహరి. నేనీ స్థితిలో వున్నానంటే ఆయనే కారణం. ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తవుతుంది. శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.