Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరోసారి రామ్ చరణ్ సినిమాలో శ్రీహరి కీ రోల్
హైదరాబాద్ : రామ్ చరణ్ 'మగధీర' చిత్రంలో షేర్ ఖాన్ గా చేసిన శ్రీహరికి మరోసారి అలాంటి ఆఫర్ వచ్చింది. రామ్ చరణ్ సినిమాలో శ్రీహరి మరోమారు షేర్ఖాన్గా కనిపించనున్నారు. రామ్చరణ్ హీరోగా అమితాబ్ బాలీవుడ్ క్లాసిక్ 'జంజీర్' రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. అమితాబ్ జంజీర్లో ప్రాణ్ చేసిన షేర్ఖాన్ పాత్రను సంజయ్దత్ చేస్తుండగా... ఈ సినిమా తెలుగు వెర్షన్లో ఈ పాత్రను శ్రీహరి పోషిస్తున్నారు. ఈ విషయాన్ని శనివారం జరిగిన 'కో అంటే కోటి' ఆడియో వేడుకలో శ్రీహరి తెలియజేశారు.
జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్.. విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి), సంజయ్ దత్(హిందీ వెర్షన్ కి), మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన 'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.