Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అపుడు అమ్మ పరిస్థితి బాగోలేదు, నాన్న తర్వాత జూ ఎన్టీఆరే ఇష్టం: మేఘాంశ్ శ్రీహరి
దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రాజ్దూత్'. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'రాజ్ దూత్' అనే బైక్ చుట్టూ సినిమా తిరుగుతుంది, రాజస్థాన్లో బైక్ కోసం గుడి కట్టారంట. దాన్ని స్పూర్తిగా తీసుకుని మా డైరెక్టర్ 'రాజ్దూత్' కథ రాశాడు. మా సినిమాలో కూడా అలాంటి సన్నివేశమే ఉంటుందని మేఘాంశ్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మేఘాంశ్ తమ ఫ్యామిలీకి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకున్నారు.
డాడీ చనిపోయిన బాధలో అమ్మ పూర్తిగా తిండి మానేసింది
నాన్నగారు చనిపోయినపుడు అమ్మగారు మతిస్థిమితంలో లేరు అనే రూమర్స్ ఉన్నాయి. ఇది నిజమేనా? అనే ప్రశ్నకు... మేఘాంశ్ స్పందిస్తూ.. ‘నిజమే... ఆ సమయంలో అమ్మకు హెల్త్ బాగోలేదు. డాడీ చనిపోయిన బాధలో అమ్మ పూర్తిగా తిండి మానేసింది. మమ్మీని ఆ స్ట్రగుల్ నుంచి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఇపుడు అంతా బావుంది.' అన్నారు.
మంచోడైనా, చెడ్డోడైనా హెల్ప్ చేసేవారు
నాన్నగారు ఇండస్ట్రీలో అన్ని రకాల మనుషులను చూశారు. మంచోడైనా, చెడ్డోడైనా హెల్ప్ చేసేవారు. మమ్మీ ఫీలవుతూ ఉండేది. అతడు కరెక్ట్ వ్యక్తి కాదు.. నువ్వు ఎందుకు హెల్ఫ్ చేస్తున్నావంటే నాన్న ఒకటే చెప్పేవారు. మనల్ని నమ్ముకుని వచ్చాడు కాబట్టి హెల్ఫ్ చేయాలి అనేవారని... మేఘాంశ్ గుర్తు చేసుకున్నారు.
నాన్న చేపట్టిన చారిటీ కార్యక్రమాలు కొనసాగిస్తాం
నాన్నగారు ఉన్నపుడు నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్షర ఫౌండేషన కూడా ఉంది. నాన్నగారు పోయిన తర్వాత వాటి కార్యకలాపాలు ఆగిపోయాి. మేము ఎదుగుతూ వాటిని కొనసాగించాలనుకుంటున్నామని మేఘాంశ్ తెలిపారు.
నాన్న తర్వాత జూ ఎన్టీఆరే.. ఆయన నుంచి అన్నీ నేర్చుకోవచ్చు
ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ ఉంది. డాడీతో అందరికీ మంచి అనుబంధం ఉంది. నేను వస్తున్నానంటే వాళ్లింటి అబ్బాయి వస్తున్నట్లే చూస్తారు. ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ పాజిటివ్ ఉంది. నాకు ఇష్టమైన హీరో జూ ఎన్టీఆర్, ఆయన ఫన్ టోన్ కానీ, అల్లరితనం, మెచ్యూరిటీ అన్నీ కరెక్టుగా ఉంటాయి. ఆయన నటన ఇష్టం. ఎన్టీఆర్ నుంచి నుంచి అన్నీ నేర్చుకోవచ్చు. నాకు డాడీ డైలాగ్ వేరియేషన్ తర్వాత ఎన్టీఆర్ గారిది చాలా ఇష్టం. ఆయన నుంచి డాన్స్, యాక్టింగ్, ఎమోషన్స్ పండించడం స్పూర్తిగా తీసుకోవచ్చు.... అని మేఘాంశ్ వ్యాఖ్యానించారు.