Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీహరి తాజా చిత్రానికి అప్పుడే సీక్వెల్
శ్రీహరి హీరోగా మొన్న శుక్రవారం...'భైరవ' చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ చేయనున్నానని శ్రీహరి చెప్పుకొచ్చారు. విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించిన 'భైరవ' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ 'విశాఖ టాకీస్ అంటే నా సొంత బేనరులాంటిది. ఈ బేనరులోనే త్వరలో 'భైరవ-2' చేస్తున్నాను' అన్నారు. అలాగే ఈ సినిమాతో మా అబ్బాయి మేఘాంశ్ నటునిగా పరిచయమయ్యాడు. వాడి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగానూ, కొంచెం అసూయగానూ ఉంది. ఇక నుంచీ సమాజానికి ఉపయోగపడే చిత్రాల్లోనే నటిస్తాను అన్నారు. ఇక నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ 'శ్రీహరి తిరుగులేని మాస్ హీరో అని ఈ చిత్రం ఓపెనింగ్స్ మరోసారి నిరూపించాయి.ఈ చిత్రాన్ని 262 సెంటర్స్లో విడుదల చేశాను. మా బేనరులో ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం 'మార్క్'ను 301 సెంటర్స్లో విడుదల చేస్తాను' అన్నారు. హీరో యిన్ సింధు తులాని, రఘు ముద్రి మేఘాంశ్, దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఇతర నటులు హాజరయ్యారు.